ETV Bharat / city

‘తెలుగమ్మాయి’ పాటకి ఎన్నిరోజులు పట్టిందో తెలుసా? - anantha sriram latest songs

సినిమా పాట రాయాలంటే కొన్ని పరిధులు ఉంటాయి. కథ కు తగ్గట్టు మాత్రమే రాయాలనే సందర్భాలు ఎదురవుతాయి. అందుకే ఓ పాట గంటలో పూర్తయితే కొన్ని పాటలు రోజులు తరబడి రాయాల్సి వస్తుంది. అలాంటపుడే రచయిత సృజనాత్మకత బయటపడుతుంది. తన పేరు శ్రోతల నోళ్లలో నానేలా చేస్తుంది. ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్‌కి ఇలాంటి పరిస్థితే వచ్చింది ఓ చిత్రం కోసం. మరీ ఆ చిత్రం పేరు తెలుసుకోవాలంటే ఆ కథనం చదవాల్సిందే.

writer anantha sriram updates
writer anantha sriram updates
author img

By

Published : Jun 10, 2020, 8:10 PM IST

సునీల్‌, సలోని జంటగా రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ కథలో నాయిక సలోని తాను వివాహం చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలో ఊహించుకుని బొమ్మలు గీస్తుంటుంది. వాటిని చూసిన కుటుంబ సభ్యులు పిచ్చి గీతలు అంటూ ఏడిపిస్తుంటారు.

ఆ బొమ్మల్లో ఏదో విషయం ఉందని కథానాయకుడు చెప్తే ఆ కుటుంబ సభ్యులు ఇంప్రెస్‌ అయ్యేలా రాయాల్సిన గీతమిది. క్లిష్టమైన సన్నివేశం కావడం వల్ల అత్యధిక సమయం పట్టిందని ఓ సందర్భంలో తెలిపారు అనంత శ్రీరామ్‌. 43 రోజుల వ్యవధిలో ఆ పాట పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. కీరవాణి, గీతా మాధురి ఆలపించిన ఈ పాట ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సునీల్‌, సలోని జంటగా రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ కథలో నాయిక సలోని తాను వివాహం చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలో ఊహించుకుని బొమ్మలు గీస్తుంటుంది. వాటిని చూసిన కుటుంబ సభ్యులు పిచ్చి గీతలు అంటూ ఏడిపిస్తుంటారు.

ఆ బొమ్మల్లో ఏదో విషయం ఉందని కథానాయకుడు చెప్తే ఆ కుటుంబ సభ్యులు ఇంప్రెస్‌ అయ్యేలా రాయాల్సిన గీతమిది. క్లిష్టమైన సన్నివేశం కావడం వల్ల అత్యధిక సమయం పట్టిందని ఓ సందర్భంలో తెలిపారు అనంత శ్రీరామ్‌. 43 రోజుల వ్యవధిలో ఆ పాట పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. కీరవాణి, గీతా మాధురి ఆలపించిన ఈ పాట ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.