ETV Bharat / business

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్​ను స్వల్ప నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్​ 52 పాయింట్లు నష్టపోయి 52,275 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11పాయింట్లు కోల్పోయి 15,740 కు చేరుకుంది. ఐటీ షేర్లు రాణించాయి.

author img

By

Published : Jun 8, 2021, 3:42 PM IST

Updated : Jun 8, 2021, 3:51 PM IST

stock market, share market
స్టాక్​ మార్కెట్​

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 52 పాయింట్లు నష్టపోయి 52,275 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 11 పాయింట్ల కోల్పోయి 15,740 వద్ద ముగిసింది. ప్రధానంగా ఆర్థిక షేర్లు నష్టపోగా.. ఐటీ షేర్లు లాభాలను గడించాయి.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గిన.. సెన్సెక్స్‌, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలకు చేరువైన నేపథ్యంలో మదుపర్లు లాభాలకు స్వీకరణకు మొగ్గుచూపడం కారణంగా సూచీలు స్తబ్దుగా కదిలాడాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,432 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,135 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,778 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,680 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభ నష్టాల్లోనివి ఇవే..

  • టెక్ ​మహీంద్ర, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​టెక్​, టైటాన్​, ఇన్ఫోసిస్​, డాక్టర్​ రెడ్డీస్​, ఐటీసీ, హిందుస్థాన్​ యూనీలివర్ షేర్లు లాభాలను గడించాయి.
  • కొటక్​ మహీంద్ర బ్యాంక్​, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ఫిన్​సర్వ్​, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టపోయాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 52 పాయింట్లు నష్టపోయి 52,275 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 11 పాయింట్ల కోల్పోయి 15,740 వద్ద ముగిసింది. ప్రధానంగా ఆర్థిక షేర్లు నష్టపోగా.. ఐటీ షేర్లు లాభాలను గడించాయి.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గిన.. సెన్సెక్స్‌, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలకు చేరువైన నేపథ్యంలో మదుపర్లు లాభాలకు స్వీకరణకు మొగ్గుచూపడం కారణంగా సూచీలు స్తబ్దుగా కదిలాడాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,432 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,135 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,778 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,680 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభ నష్టాల్లోనివి ఇవే..

  • టెక్ ​మహీంద్ర, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​టెక్​, టైటాన్​, ఇన్ఫోసిస్​, డాక్టర్​ రెడ్డీస్​, ఐటీసీ, హిందుస్థాన్​ యూనీలివర్ షేర్లు లాభాలను గడించాయి.
  • కొటక్​ మహీంద్ర బ్యాంక్​, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ఫిన్​సర్వ్​, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టపోయాయి.
Last Updated : Jun 8, 2021, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.