ETV Bharat / business

'జీవితాలు, జీవనోపాధి కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు'

author img

By

Published : Apr 19, 2021, 12:42 PM IST

దేశంలో కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో కార్పొరేట్లు, పరిశ్రమ సంఘాలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు జరిపారు. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు.

FM Sitaraman
నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో జీవితాలు, జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.

దేశీయ కార్పొరేట్​ల సమస్యలకు సంబంధించి ఇప్పటికే వివిధ పరిశ్రమ సంఘాల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిపారు సీతారామన్​. కరోనా రెండో దశను ఎదుర్కొనేందుకు వివిధ వ్యాపారాల నుంచి సూచనలు కోరినట్లు చెప్పారు.

నిర్మలా సీతారామన్​తో చర్చల్లో పాల్గొన్న వారిలో.. సీఐఐ అధ్యక్షుడు ఉదయ్​ కోటక్​, ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్​ శంకర్​, అసోచామ్​ అధ్యక్షుడు వినిత్​ అగర్వాల్​ ఉన్నారు.

టాటా స్టీల్​ ఎండీ టి.వి.నరేంద్రన్​, ఎల్​&టీ ఛైర్మన్​ ఏ.ఎం.నాయక్​, టీసీఎస్​ ఎండీ రాజేశ్​ గోపీనాథ్, మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్​.సి.భార్గవ, టీవీఎస్​ గ్రూప్​ ఛైర్మన్​ వెను శ్రీనివాసన్​, హీరో మోటోకార్ప్​ ఎండీ పవన్​ ముంజల్​ వంటి దిగ్గజ కార్పొరేట్లతో కూడా సీతారామన్​ వివిధ అంశాలపై చర్చలు జరిపారు.

మరోసారి దేశంలో లాక్​డౌన్​ పెట్టే యోచన లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే స్పష్టం చేశారు. నియంత్రణ చర్యలు మాత్రమే ఉంటాయని తెలిపారు.

ఇదీ చదవండి:కొవిడ్​ కేసుల పెరుగుదలతో జీడీపీ అంచనాల్లో కోత

దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో జీవితాలు, జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.

దేశీయ కార్పొరేట్​ల సమస్యలకు సంబంధించి ఇప్పటికే వివిధ పరిశ్రమ సంఘాల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిపారు సీతారామన్​. కరోనా రెండో దశను ఎదుర్కొనేందుకు వివిధ వ్యాపారాల నుంచి సూచనలు కోరినట్లు చెప్పారు.

నిర్మలా సీతారామన్​తో చర్చల్లో పాల్గొన్న వారిలో.. సీఐఐ అధ్యక్షుడు ఉదయ్​ కోటక్​, ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్​ శంకర్​, అసోచామ్​ అధ్యక్షుడు వినిత్​ అగర్వాల్​ ఉన్నారు.

టాటా స్టీల్​ ఎండీ టి.వి.నరేంద్రన్​, ఎల్​&టీ ఛైర్మన్​ ఏ.ఎం.నాయక్​, టీసీఎస్​ ఎండీ రాజేశ్​ గోపీనాథ్, మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్​.సి.భార్గవ, టీవీఎస్​ గ్రూప్​ ఛైర్మన్​ వెను శ్రీనివాసన్​, హీరో మోటోకార్ప్​ ఎండీ పవన్​ ముంజల్​ వంటి దిగ్గజ కార్పొరేట్లతో కూడా సీతారామన్​ వివిధ అంశాలపై చర్చలు జరిపారు.

మరోసారి దేశంలో లాక్​డౌన్​ పెట్టే యోచన లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే స్పష్టం చేశారు. నియంత్రణ చర్యలు మాత్రమే ఉంటాయని తెలిపారు.

ఇదీ చదవండి:కొవిడ్​ కేసుల పెరుగుదలతో జీడీపీ అంచనాల్లో కోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.