ETV Bharat / business

గడువు ముగుస్తోంది.. ఐటీఆర్ దాఖలు చేశారా? - ఐటీఆర్​ల దాఖలుపై ఆదాయపు పన్నుశాఖ ప్రకటన

డిసెంబరు 21 నాటికి దేశవ్యాప్తంగా 3.75 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం ప్రకటించింది. మిగతావారు కూడా రిటర్నుల కోసం దాఖలు చేసుకోవాలంటూ ట్విట్టర్‌ వేదికగా కోరింది.

I-T returns filed for last Fiscal
ఐటీఆర్​ల దాఖలుపై ఐటీ ప్రకటన
author img

By

Published : Dec 22, 2020, 8:00 PM IST

2020-21 మదింపు సంవత్సరానికి గాను డిసెంబర్ 21 నాటికి 3.75 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) ప్రకటించింది. ఇంకా రిటర్నులు దాఖలు చేయనివారెవరైనా ఉంటే వీలైనంత త్వరగా ఆ పనిని పూర్తి చేయాలని ట్విట్టర్​లో కోరింది.

2.17 కోట్ల మంది ఐటీఆర్-1ను, 79.82 లక్షల మంది ఐటీఆర్-4ను, 43.18 లక్షల మంది ఐటీఆర్​-3ను, 26.56 లక్షల మంది ఐటీఆర్​-2ను దాఖలు చేసినట్లు ఐటీ విభాగం పేర్కొంది.

"వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు 2019-20 ఆర్థిక సంవత్సర (2020-21 మదింపు సంవత్సర) రిటర్ను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31తో గడువు ముగియనుంది. ఆడిటింగ్ అవసరమైన వారు రిటర్ను దాఖలు చేసేందుకు 2021 జనవరి 31 వరకు అవకాశముంది" అని ఐటీ విభాగం గుర్తు చేసింది.

నిజానికి ఐటీఆర్ దాఖలుకు తుది గడువు జులై 31తో ముగియాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో దానిని అక్టోబర్ 31 వరకు పెంచింది కేంద్రం. ఆ తర్వాత మరోసారి డిసెంబర్ 31 వరకు పొడిగించింది.

ఇదీ చూడండి:తగ్గిన బంగారం, వెండి ధరలు

2020-21 మదింపు సంవత్సరానికి గాను డిసెంబర్ 21 నాటికి 3.75 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) ప్రకటించింది. ఇంకా రిటర్నులు దాఖలు చేయనివారెవరైనా ఉంటే వీలైనంత త్వరగా ఆ పనిని పూర్తి చేయాలని ట్విట్టర్​లో కోరింది.

2.17 కోట్ల మంది ఐటీఆర్-1ను, 79.82 లక్షల మంది ఐటీఆర్-4ను, 43.18 లక్షల మంది ఐటీఆర్​-3ను, 26.56 లక్షల మంది ఐటీఆర్​-2ను దాఖలు చేసినట్లు ఐటీ విభాగం పేర్కొంది.

"వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు 2019-20 ఆర్థిక సంవత్సర (2020-21 మదింపు సంవత్సర) రిటర్ను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31తో గడువు ముగియనుంది. ఆడిటింగ్ అవసరమైన వారు రిటర్ను దాఖలు చేసేందుకు 2021 జనవరి 31 వరకు అవకాశముంది" అని ఐటీ విభాగం గుర్తు చేసింది.

నిజానికి ఐటీఆర్ దాఖలుకు తుది గడువు జులై 31తో ముగియాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో దానిని అక్టోబర్ 31 వరకు పెంచింది కేంద్రం. ఆ తర్వాత మరోసారి డిసెంబర్ 31 వరకు పొడిగించింది.

ఇదీ చూడండి:తగ్గిన బంగారం, వెండి ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.