రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత వ్యాపార చరిత్రలో సరికొత్త అధ్యాయం లఖించింది. రూ.10లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటిన తొలి కంపెనీగా రికార్డు సృష్టించింది.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ షేర్లు ఇవాళ్టి బీఎస్ఈ ట్రేడింగ్లో 0.90శాతం పెరిగి రూ.1,584 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. తర్వాత కాస్త తగ్గి... 0.65 శాతం వృద్ధితో రూ.1,579.95 వద్ద స్థిరపడ్డాయి. ఎన్ఎస్ఈలో 0.77 శాతం లాభపడి రూ.1,582 వద్ద ముగిశాయి.
ఒక్క ఏడాదే 40 శాతం వృద్ధి..!
రిలయన్స్ షేరు ధర ఈ ఒక్క ఏడాదే 40శాతం వరకు పెరగడం విశేషం. రిలయన్స్ అక్టోబర్లో రూ.9లక్షల కోట్ల మార్కెట్ విలువను చేరుకొంది. అప్పటి నుంచి షేరు ధర పెరుగుతూ వస్తోంది. గతవారం రూ.9.5లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటింది. ఈ వారంలో రూ.10లక్షల కోట్ల మార్కును అలవోకగా అధిగమించింది.
రిలయన్స్ తర్వాతి స్థానంలో టెక్ దిగ్గజం టీసీఎస్(రూ. 7.79 లక్షల కోట్లు) నిలిచింది. ఆయితే ఈ రెండు కంపెనీల మార్కెట్ విలువలో దాదాపు రూ.2లక్షల కోట్ల వ్యత్యాసం ఉంది.
రూ.8లక్షల కోట్ల మైలురాయిని దాటిన తొలి కంపెనీ కూడా రిలయన్సే కావడం గమనార్హం.
ఇదీ చూడండి : రిలయన్స్ జోరుతో జీవితకాల గరిష్ఠానికి మార్కెట్లు