ETV Bharat / business

పీఎం కేర్స్​కు కార్పొరేట్ల విరాళాల వెల్లువ

author img

By

Published : Apr 3, 2020, 7:28 AM IST

కరోనాను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్​కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ గ్రూప్​, శ్రీరామ్​ గ్రూప్​ సహా పలు సంస్థలు భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చాయి.

pm cares news
పీఎం కేర్స్​కు విరాళాల వెల్లువ

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వానికి కార్పొరేట్లు చేయుతనిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దిగ్గజ సంస్థలన్నీ భారీ విరాళాలతో ముందుకొస్తున్నాయి. పీఎం కేర్స్​కు రూ.257.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రభుత్వరంగ విద్యుదుత్పాదన సంస్థ ఎన్​టీపీసీ ప్రకటించింది. ఇందులో రూ.250 కోట్లను ఎన్​టీపీసీ ఇవ్వనుండగా.. రూ.7.5 కోట్లను సంస్థ ఉద్యోగులు (ఒక రోజు వేతనం) విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మరో రూ.11 కోట్లను కరోనా నియంత్రణ చర్యల కోసం ఖర్చు చేయనున్నట్లు ఎన్​టీపీసీ ప్రకటించింది.

ఆర్థిక సేవల సంస్థ హెచ్​డీఎఫ్​సీ గ్రూప్​.. రూ.150 కోట్లు విరాళం ప్రకటించింది.

ఇప్పటికే రూ.101 కోట్ల విరాళం ఇచ్చిన వేదాంత.. మరో రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. సంస్థ ఉద్యోగులు కూడా ఒక రోజు వేతానాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు వేదాంత ఇది వరకే ప్రకటించింది.

మరో ఆర్థిక సేవల సంస్థ శ్రీరామ్​ గ్రూప్​ కూడా పీఎం కేర్స్​కు రూ.10 కోట్లు విరాళం ఇచ్చింది. ఆల్​ కార్గొ సంస్థ మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిధులకు రూ. కోటి విరాళంగా ప్రకటించింది.

ఇదీ చూడండి:'జన్‌ధన్‌' నగదు ఉపసంహరణ ఆ కొద్ది రోజులే!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వానికి కార్పొరేట్లు చేయుతనిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దిగ్గజ సంస్థలన్నీ భారీ విరాళాలతో ముందుకొస్తున్నాయి. పీఎం కేర్స్​కు రూ.257.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రభుత్వరంగ విద్యుదుత్పాదన సంస్థ ఎన్​టీపీసీ ప్రకటించింది. ఇందులో రూ.250 కోట్లను ఎన్​టీపీసీ ఇవ్వనుండగా.. రూ.7.5 కోట్లను సంస్థ ఉద్యోగులు (ఒక రోజు వేతనం) విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మరో రూ.11 కోట్లను కరోనా నియంత్రణ చర్యల కోసం ఖర్చు చేయనున్నట్లు ఎన్​టీపీసీ ప్రకటించింది.

ఆర్థిక సేవల సంస్థ హెచ్​డీఎఫ్​సీ గ్రూప్​.. రూ.150 కోట్లు విరాళం ప్రకటించింది.

ఇప్పటికే రూ.101 కోట్ల విరాళం ఇచ్చిన వేదాంత.. మరో రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. సంస్థ ఉద్యోగులు కూడా ఒక రోజు వేతానాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు వేదాంత ఇది వరకే ప్రకటించింది.

మరో ఆర్థిక సేవల సంస్థ శ్రీరామ్​ గ్రూప్​ కూడా పీఎం కేర్స్​కు రూ.10 కోట్లు విరాళం ఇచ్చింది. ఆల్​ కార్గొ సంస్థ మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిధులకు రూ. కోటి విరాళంగా ప్రకటించింది.

ఇదీ చూడండి:'జన్‌ధన్‌' నగదు ఉపసంహరణ ఆ కొద్ది రోజులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.