టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్టెల్(airtel recharge), ఐడియా, రిలయన్స్ జియో.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచి.. యూజర్లకు భారీ షాకిచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్, అన్లిమిటెడ్ వాయిస్ ప్యాక్లు, మొబైల్ డేటా రీఛార్జ్ల ధరలను 20-25 శాతం పెంచాయి.
తొలుత ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలను నవంబరు 26 నుంచి అమలు చేస్తోంది. ఆ వెంటనే వొడాఫోన్ ఐడియా కూడా రీఛార్జ్ ధరలను పెంచిన ధరలను నవంబరు 25 నుంచి అమలు చేస్తోంది. దేశంలో అతిపెద్ద టెలికాం రిలయన్స్ జియో.. తానేమి తక్కువ కాదంటూ ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా బాటలో పయనించింది. పెంచిన ధరలను డిసెంబరు 1 నుంచి అమలు చేయనుంది. మొత్తంమీద, టెలికాం ప్రొవైడర్ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో 20 నుంచి 25 శాతం పెంచారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థ టారీఫ్ రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
![TARIFF PLANS vi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13768519_vode_idea_i_tariff-1.jpg)
![TARIFF PLANS jio vi airtel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13768519_vode_idea_i_tariff-2.jpg)
![TARIFF PLANS jio](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13768519_vode_idea_i_tariff-3.jpg)
ఇదీ చదవండి: విదేశాలకు కొవాగ్జిన్ ఎగుమతి ప్రారంభం