ETV Bharat / business

'ఆర్థిక రక్షణపైనే పాలసీదార్ల చూపు'

author img

By

Published : May 9, 2020, 8:13 AM IST

‘కరోనా వైరస్‌ అందరిలోనూ ఒకరకమైన ఆర్థిక అనిశ్చితికి కారణమయ్యింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనే భావన పెరిగింది. పెట్టుబడులు, పన్ను ప్రయోజనాలకన్నా దీర్ఘకాలంలో అధిక ఆర్థిక రక్షణే ముఖ్యమని పాలసీదారులు గ్రహిస్తున్నారు’ అని చెబుతున్నారు మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ప్రశాంత్‌ త్రిపాఠి. బీమా ప్రీమియంపై జీఎస్‌టీ తగ్గించడం లాంటి చర్యలతో ఈ రంగానికి మేలు చేకూరుస్తుందని ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో తెలిపారు.

interview with max life insurance CEO-MD
'ఆర్థిక రక్షణపైనే పాలసీదార్ల చూపు'

జీవిత బీమా రంగ వృద్ధి అంచనాలకు అనుగుణంగా ఉందా?

దీర్ఘకాలంలో జీవిత బీమా రంగం 12-15 శాతం వృద్ధి చెందుతుందనే అంచనాలున్నాయి. ప్రస్తుత సంక్షోభం సర్దుమణిగాక ఒక అంచనాకు రావచ్చు. తమపై ఆధారపడిన వారికి తప్పనిసరిగా ఆర్థిక రక్షణ కల్పించాలనే నిర్ణయానికి పాలసీదార్లు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇకపై పొదుపు, పెట్టుబడి పాలసీలకన్నా టర్మ్‌ పాలసీలను తీసుకోవడం ద్వారా, అనుకోని విపత్తు ఎదురైనా కుటుంబం బెంబేలు పడకుండా అధిక మొత్తంలో ఆర్థిక రక్షణ కల్పించాలని చాలామంది ఆలోచిస్తున్నారు. కాబట్టి సానుకూల వృద్ధి ఆశిస్తున్నాం.

కొవిడ్‌-19 వల్ల జీవిత బీమా రంగానికి ఎదురవుతున్న కొత్త సవాళ్లేమిటి? సంస్థలు ఎలా ఎదుర్కోబోతున్నాయి?

భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో పాలసీలను విక్రయించే సంప్రదాయ పద్ధతులకు అంతరాయం కలిగింది. అందుకే డిజిటలీకరణ అధికమవుతోంది. పాలసీలను విక్రయించడం, ఇప్పటికే ఉన్న పాలసీల పునరుద్ధరణ, క్లెయిం సెటిల్‌మెంట్‌, సేవలు అందించడం తదితరాలన్నింటికీ డిజిటల్‌, ఇతర సాంకేతికతలను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఏజెంట్లకూ శిక్షణనిస్తున్నాయి. డిజిటల్‌ విక్రయాల కోసం సాంకేతికత, నిపుణులపైన ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. బీమా అవసరంపై ప్రజల్లో వచ్చిన సానుకూల మార్పును అందిపుచ్చుకునేందుకు, గిరాకీకి అనుగుణంగా విస్తరించేందుకు డిజిటల్‌ బాట ఉపయోగపడుతుంది. బీమా ప్రీమియంపై జీఎస్‌టీని తగ్గిస్తే ఈ రంగం మరింత వృద్ధి సాధిస్తుందని చెప్పొచ్చు.

కొత్త పాలసీల విక్రయం, పాత పాలసీల పునరుద్ధరణపై కొవిడ్‌-19 ప్రభావం ఎంత మేరకు ఉంది?

లాక్‌డౌన్‌ బీమా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే బీమా పాలసీల విక్రయం ఆన్‌లైన్‌లో సాగడం ఉపకరించింది. మా సంస్థ 2019 ఏప్రిల్‌తో పోలిస్తే.. ఈ ఏప్రిల్‌లో అధిక పాలసీలను విక్రయించింది. మున్ముందు కొత్త బీమా వ్యాపారంపై కొంత ప్రభావం తప్పదు. పునరుద్ధరణ ప్రీమియం వసూలుకు కొంత గడువు పెంచినందున అదీ వాయిదా పడొచ్చు. చెక్కులు, నగదు ద్వారా ప్రీమియం చెల్లింపులూ కొంత ఆలస్యం కావచ్చు. బ్యాంకు ఖాతాల నుంచి ప్రీమియం చెల్లిస్తున్న వారి సంఖË్య పెరుగుతున్నందున, పునరుద్ధరణ ప్రీమియంపై 20-25శాతమే ప్రభావం ఉండొచ్చు.

బీమా పాలసీలను పన్ను ఆదా కోసం ఎక్కువమంది తీసుకుంటుంటారు. ఆదాయపు పన్ను నూతన నిబంధనల ప్రభావం ఎలా ఉంటుంది?

బీమా ప్రీమియానికి సెక్షన్‌ 80సీ నిబంధనలకు లోబడి పన్ను మినహాయింపు లభిస్తుంది. వ్యవధి తీరిన తర్వాత వచ్చిన మొత్తానికి సెక్షన్‌ 10(10డి) ప్రకారం ఎలాంటి పన్నూ ఉండదు. చాలామంది దీన్ని ఒక ప్రయోజనంగానే భావిస్తున్నారు. కానీ ఇప్పుడు పాలసీదారులు అనేక లెక్కలు వేసుకుంటున్నారు. వాటిని బట్టి, పాత పన్నుల విధానమే మేలని భావిస్తున్నారు. కాబట్టి, బీమా పాలసీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏమాత్రం సందేహించడం లేదు. కొవిడ్‌-19 సంక్షోభాన్ని ఎదుర్కొన్నాక, దీర్ఘకాలిక రక్షణ ముఖ్యమని ఆలోచిస్తున్నారు. కొన్ని రోజులుగా టర్మ్‌ పాలసీలకు లభిస్తున్న ఆదరణే ఇందుకు రుజువు.

టర్మ్‌ పాలసీల ప్రీమియం తగ్గే అవకాశం ఉందా?

ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే, భారత్‌లోనే ఇవి తక్కువ ప్రీమియంతో లభిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వీటి ధర ఎక్కువగానే ఉంది. కాబట్టి, ఈ పాలసీల ధరలు భవిష్యత్తులో పెరిగేందుకే ఆస్కారం ఉంది. దీంతోపాటు, రీఇన్సూరెన్స్‌ ఖరీదవుతోంది. ఈ సంస్థలకు ఎదురవుతున్న అనేక సమస్యలు, ఇతర ఇబ్బందుల దృష్ట్యా అవి ప్రీమియాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల బీమా సంస్థలపై నేరుగా భారం పడుతుంది. అందువల్ల టర్మ్‌ పాలసీల ప్రీమియం పెరిగేందుకే అవకాశం ఎక్కువ.

సమీప భవిష్యత్తులో వినూత్న పాలసీలేమైనా తెస్తున్నారా?

బీమా రంగం 12-15శాతం వృద్ధి సాధిస్తుందనే అంచనాల నేపథ్యంలో మ్యాక్స్‌ లైఫ్‌ కూడా అదే స్థాయిలో వ్యాపారాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాం. కొవిడ్‌19 ప్రభావం వల్ల ఈ ఏడాది వ్యాపార లక్ష్యాలను నిర్ణయించుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత మరోసారి సమీక్షిస్తాం. పాలసీదారుల అన్ని రకాల అవసరాలను తీర్చేలా మా పథకాలున్నాయి. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఉపయోగపడేలా.. పూర్తి స్థాయి ఆర్థిక రక్షణ లభించే పాలసీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.

జీవిత బీమా రంగ వృద్ధి అంచనాలకు అనుగుణంగా ఉందా?

దీర్ఘకాలంలో జీవిత బీమా రంగం 12-15 శాతం వృద్ధి చెందుతుందనే అంచనాలున్నాయి. ప్రస్తుత సంక్షోభం సర్దుమణిగాక ఒక అంచనాకు రావచ్చు. తమపై ఆధారపడిన వారికి తప్పనిసరిగా ఆర్థిక రక్షణ కల్పించాలనే నిర్ణయానికి పాలసీదార్లు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇకపై పొదుపు, పెట్టుబడి పాలసీలకన్నా టర్మ్‌ పాలసీలను తీసుకోవడం ద్వారా, అనుకోని విపత్తు ఎదురైనా కుటుంబం బెంబేలు పడకుండా అధిక మొత్తంలో ఆర్థిక రక్షణ కల్పించాలని చాలామంది ఆలోచిస్తున్నారు. కాబట్టి సానుకూల వృద్ధి ఆశిస్తున్నాం.

కొవిడ్‌-19 వల్ల జీవిత బీమా రంగానికి ఎదురవుతున్న కొత్త సవాళ్లేమిటి? సంస్థలు ఎలా ఎదుర్కోబోతున్నాయి?

భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో పాలసీలను విక్రయించే సంప్రదాయ పద్ధతులకు అంతరాయం కలిగింది. అందుకే డిజిటలీకరణ అధికమవుతోంది. పాలసీలను విక్రయించడం, ఇప్పటికే ఉన్న పాలసీల పునరుద్ధరణ, క్లెయిం సెటిల్‌మెంట్‌, సేవలు అందించడం తదితరాలన్నింటికీ డిజిటల్‌, ఇతర సాంకేతికతలను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఏజెంట్లకూ శిక్షణనిస్తున్నాయి. డిజిటల్‌ విక్రయాల కోసం సాంకేతికత, నిపుణులపైన ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. బీమా అవసరంపై ప్రజల్లో వచ్చిన సానుకూల మార్పును అందిపుచ్చుకునేందుకు, గిరాకీకి అనుగుణంగా విస్తరించేందుకు డిజిటల్‌ బాట ఉపయోగపడుతుంది. బీమా ప్రీమియంపై జీఎస్‌టీని తగ్గిస్తే ఈ రంగం మరింత వృద్ధి సాధిస్తుందని చెప్పొచ్చు.

కొత్త పాలసీల విక్రయం, పాత పాలసీల పునరుద్ధరణపై కొవిడ్‌-19 ప్రభావం ఎంత మేరకు ఉంది?

లాక్‌డౌన్‌ బీమా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే బీమా పాలసీల విక్రయం ఆన్‌లైన్‌లో సాగడం ఉపకరించింది. మా సంస్థ 2019 ఏప్రిల్‌తో పోలిస్తే.. ఈ ఏప్రిల్‌లో అధిక పాలసీలను విక్రయించింది. మున్ముందు కొత్త బీమా వ్యాపారంపై కొంత ప్రభావం తప్పదు. పునరుద్ధరణ ప్రీమియం వసూలుకు కొంత గడువు పెంచినందున అదీ వాయిదా పడొచ్చు. చెక్కులు, నగదు ద్వారా ప్రీమియం చెల్లింపులూ కొంత ఆలస్యం కావచ్చు. బ్యాంకు ఖాతాల నుంచి ప్రీమియం చెల్లిస్తున్న వారి సంఖË్య పెరుగుతున్నందున, పునరుద్ధరణ ప్రీమియంపై 20-25శాతమే ప్రభావం ఉండొచ్చు.

బీమా పాలసీలను పన్ను ఆదా కోసం ఎక్కువమంది తీసుకుంటుంటారు. ఆదాయపు పన్ను నూతన నిబంధనల ప్రభావం ఎలా ఉంటుంది?

బీమా ప్రీమియానికి సెక్షన్‌ 80సీ నిబంధనలకు లోబడి పన్ను మినహాయింపు లభిస్తుంది. వ్యవధి తీరిన తర్వాత వచ్చిన మొత్తానికి సెక్షన్‌ 10(10డి) ప్రకారం ఎలాంటి పన్నూ ఉండదు. చాలామంది దీన్ని ఒక ప్రయోజనంగానే భావిస్తున్నారు. కానీ ఇప్పుడు పాలసీదారులు అనేక లెక్కలు వేసుకుంటున్నారు. వాటిని బట్టి, పాత పన్నుల విధానమే మేలని భావిస్తున్నారు. కాబట్టి, బీమా పాలసీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏమాత్రం సందేహించడం లేదు. కొవిడ్‌-19 సంక్షోభాన్ని ఎదుర్కొన్నాక, దీర్ఘకాలిక రక్షణ ముఖ్యమని ఆలోచిస్తున్నారు. కొన్ని రోజులుగా టర్మ్‌ పాలసీలకు లభిస్తున్న ఆదరణే ఇందుకు రుజువు.

టర్మ్‌ పాలసీల ప్రీమియం తగ్గే అవకాశం ఉందా?

ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే, భారత్‌లోనే ఇవి తక్కువ ప్రీమియంతో లభిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వీటి ధర ఎక్కువగానే ఉంది. కాబట్టి, ఈ పాలసీల ధరలు భవిష్యత్తులో పెరిగేందుకే ఆస్కారం ఉంది. దీంతోపాటు, రీఇన్సూరెన్స్‌ ఖరీదవుతోంది. ఈ సంస్థలకు ఎదురవుతున్న అనేక సమస్యలు, ఇతర ఇబ్బందుల దృష్ట్యా అవి ప్రీమియాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల బీమా సంస్థలపై నేరుగా భారం పడుతుంది. అందువల్ల టర్మ్‌ పాలసీల ప్రీమియం పెరిగేందుకే అవకాశం ఎక్కువ.

సమీప భవిష్యత్తులో వినూత్న పాలసీలేమైనా తెస్తున్నారా?

బీమా రంగం 12-15శాతం వృద్ధి సాధిస్తుందనే అంచనాల నేపథ్యంలో మ్యాక్స్‌ లైఫ్‌ కూడా అదే స్థాయిలో వ్యాపారాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాం. కొవిడ్‌19 ప్రభావం వల్ల ఈ ఏడాది వ్యాపార లక్ష్యాలను నిర్ణయించుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత మరోసారి సమీక్షిస్తాం. పాలసీదారుల అన్ని రకాల అవసరాలను తీర్చేలా మా పథకాలున్నాయి. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఉపయోగపడేలా.. పూర్తి స్థాయి ఆర్థిక రక్షణ లభించే పాలసీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.