ETV Bharat / business

'బ్యాంకులపై మారటోరియం భారాన్ని తొలగించండి' - మారటోరియంతో బ్యాంకులపై భారం

2020 మార్చి-ఆగస్టు కాలానికి విధించిన మారటోరియంపై వసూలు చేసిన చక్రవడ్డీ మాఫీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా.. బ్యాంకులపై పడిన భారాన్ని తొలగించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.

banks
బ్యాంకు
author img

By

Published : May 23, 2021, 4:46 PM IST

గతేడాది కొవిడ్​ లాక్​డౌన్​ దృష్ట్యా విధించిన మారటోరియం కాలానికి.. వివిధ రుణాలపై చక్రవడ్డీ మాఫీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బ్యాంకులపై పడిన భారాన్ని తొలగించేందుకు సహకరించాలని భారతీయ బ్యాంకుల సంఘం.. ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.

రూ.2 కోట్లకు పైగా ఉన్న రుణాలపై చక్ర వడ్డీని మాఫీ చేయాలని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్​లో తీర్పునిచ్చింది. దశల వారీగా దీనిని అమలు చేసేందుకు వివిధ బ్యాంకులు సమయాత్తమవుతున్నాయి.

"సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాఫీ చేస్తే.. మా బ్యాంకుపై సుమారు రూ.30 కోట్లు భారం పడుతుంది."

-ఎస్.కృష్ణన్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండీ

తాత్కాలిక మారటోరియం పథకం(2020-21) కింద చక్రవడ్డీ మాఫీకి ప్రభుత్వంపై కనీసం రూ.5,500 కోట్ల భారం పడుతుందని అంచనా.

ఇవీ చదవండి: మారటోరియం కాలానికి చక్రవడ్డీ వసూలు నిషిద్ధం: సుప్రీం

'ఐదేళ్ల మారటోరియంతోనే ఎంఎస్​ఎంఈలకు ఊరట'

గతేడాది కొవిడ్​ లాక్​డౌన్​ దృష్ట్యా విధించిన మారటోరియం కాలానికి.. వివిధ రుణాలపై చక్రవడ్డీ మాఫీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బ్యాంకులపై పడిన భారాన్ని తొలగించేందుకు సహకరించాలని భారతీయ బ్యాంకుల సంఘం.. ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.

రూ.2 కోట్లకు పైగా ఉన్న రుణాలపై చక్ర వడ్డీని మాఫీ చేయాలని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్​లో తీర్పునిచ్చింది. దశల వారీగా దీనిని అమలు చేసేందుకు వివిధ బ్యాంకులు సమయాత్తమవుతున్నాయి.

"సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాఫీ చేస్తే.. మా బ్యాంకుపై సుమారు రూ.30 కోట్లు భారం పడుతుంది."

-ఎస్.కృష్ణన్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండీ

తాత్కాలిక మారటోరియం పథకం(2020-21) కింద చక్రవడ్డీ మాఫీకి ప్రభుత్వంపై కనీసం రూ.5,500 కోట్ల భారం పడుతుందని అంచనా.

ఇవీ చదవండి: మారటోరియం కాలానికి చక్రవడ్డీ వసూలు నిషిద్ధం: సుప్రీం

'ఐదేళ్ల మారటోరియంతోనే ఎంఎస్​ఎంఈలకు ఊరట'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.