ETV Bharat / business

ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.10,900 కోట్లు

author img

By

Published : Mar 31, 2021, 3:50 PM IST

ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.10,900 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేసింది కేంద్రం. దీని ద్వారా 2.5లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని పేర్కొంది. ఇది రైతులకు మేలు చేసే గొప్ప నిర్ణయమని పేర్కొంది.

PLI scheme for food processing sector
పీయూష్ గోయల్​

ఆహారశుద్ధి పరిశ్రమలకు కేంద్రం ప్రోత్సాహకాలు విడుదల చేసింది. మొత్తం రూ.10,900 కోట్లు కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపింది.

దీని ద్వారా 2.5లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చని ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇది రైతులకు మేలు చేసే గొప్ప నిర్ణయమని చెప్పారు. ఎగుమతులకు ఊతం లభిస్తుందని, వినియోగదారులకు విలువ ఆధారిత ఉత్పత్తులు లభ్యమవుతాయని పేర్కొన్నారు.

12-13 రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని పార్లమెంటులో బడ్జెట్​ సందర్భంగా కేంద్రం ప్రకటించిందని సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్​ తెలిపారు. ఇప్పటికే 6 రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించామని చెప్పారు.

ఇదీ చూడండి: ఎంఐలో టాప్​ఎండ్​ ఫోన్​- ధర తెలుసా?

ఆహారశుద్ధి పరిశ్రమలకు కేంద్రం ప్రోత్సాహకాలు విడుదల చేసింది. మొత్తం రూ.10,900 కోట్లు కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపింది.

దీని ద్వారా 2.5లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చని ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇది రైతులకు మేలు చేసే గొప్ప నిర్ణయమని చెప్పారు. ఎగుమతులకు ఊతం లభిస్తుందని, వినియోగదారులకు విలువ ఆధారిత ఉత్పత్తులు లభ్యమవుతాయని పేర్కొన్నారు.

12-13 రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని పార్లమెంటులో బడ్జెట్​ సందర్భంగా కేంద్రం ప్రకటించిందని సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్​ తెలిపారు. ఇప్పటికే 6 రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించామని చెప్పారు.

ఇదీ చూడండి: ఎంఐలో టాప్​ఎండ్​ ఫోన్​- ధర తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.