ETV Bharat / business

కుబేరుల సంపద 12.83 లక్షల కోట్ల డాలర్లకు

2020లో భారత్​లో కుబేరుల సంపద 4.4 శాతం తగ్గినట్లు క్రెడిట్‌ సూయిజ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక వెల్లడించింది. కరోనా కారణంగా రూపాయి విలువ క్షీణించటం వల్ల కుబేరుల సంపద తగ్గినట్లు పేర్కొంది. ముకేశ్ అంబానీ, అదానీల సంపద మాత్రం పెరిగినట్లు నివేదిక వివరించింది.

author img

By

Published : Jun 23, 2021, 6:42 AM IST

billionares
కుబేరుల సంపద

గతేడాది కొందరు కుబేరుల సంపద బాగా పెరిగినా భారత్‌లోని అధిక సంపన్నుల మొత్తం సంపద విలువ తగ్గింది. కొవిడ్‌ పరిణామాలకు తోడు రూపాయి విలువ క్షీణించడం వల్ల కుబేరుల సంపద విలువ 4.4 శాతం కరిగి 12.83 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైందని క్రెడిట్‌ సూయిజ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం..

భారత్‌లో డాలర్‌ రూపేణ మిలియనీర్ల సంఖ్య 2019లో 7,64,000 కాగా.. 2020లో 6,98,000కు పరిమితమైంది. వీరి మొత్తం సంపద విలువ 2019 కంటే 4.4 శాతం (594 బిలియన్‌ డాలర్లు) తగ్గి 12.833 లక్షల కోట్ల డాలర్ల (రూ.962 లక్షల కోట్లు)కు చేరింది.

  • అంతర్జాతీయ కుబేరుల్లో భారత్‌ 1% మందికే ప్రాతినిధ్యం వహిస్తోంది.
  • 2025 కల్లా భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 81.8 శాతం పెరిగి 13 లక్షలకు చేరుకోవచ్చని అంచనా.
  • గతేడాది ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య 52 లక్షలు పెరిగి 5.61 కోట్లకు చేరింది. వీరి సంపద విలువ 28.7 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 418.3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
  • 2020లో సగటున భారత్‌లో ప్రతి యువకుడు/యువతి వద్ద 14,252 డాలర్ల సంపద ఉంది. ఇది 2000 నుంచి సగటున ఏటా 8.8% మేర పెరుగుతూ వచ్చింది. ప్రపంచ సగటు 4.8 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ.
  • 50 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ నికర సంపద ఉన్న ధనవంతులు 4320 మంది వరకు దేశంలో ఉన్నారు.

ముకేశ్‌ సంపాదన.. గంటకు రూ.90 కోట్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ గంటకు రూ.90 కోట్ల చొప్పున 2020లో మొత్తం రూ.2,77,700 కోట్లు సంపాదించడంతో మొత్తం ఆయన సంపద రూ.6,58,400 కోట్లకు చేరిందని హూరన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ చెబుతోంది.

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ అదానీ సంపద మే మధ్య నాటికి 16.2 బిలియన్‌ డాలర్లు పెరిగి 67.6 బిలియన్‌ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్‌ అంటోంది.

ఇదీ చదవండి : రూ.కోట్లు కురిపిస్తున్న 'మీమ్స్'​- అమ్మేయండిలా...

గతేడాది కొందరు కుబేరుల సంపద బాగా పెరిగినా భారత్‌లోని అధిక సంపన్నుల మొత్తం సంపద విలువ తగ్గింది. కొవిడ్‌ పరిణామాలకు తోడు రూపాయి విలువ క్షీణించడం వల్ల కుబేరుల సంపద విలువ 4.4 శాతం కరిగి 12.83 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైందని క్రెడిట్‌ సూయిజ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం..

భారత్‌లో డాలర్‌ రూపేణ మిలియనీర్ల సంఖ్య 2019లో 7,64,000 కాగా.. 2020లో 6,98,000కు పరిమితమైంది. వీరి మొత్తం సంపద విలువ 2019 కంటే 4.4 శాతం (594 బిలియన్‌ డాలర్లు) తగ్గి 12.833 లక్షల కోట్ల డాలర్ల (రూ.962 లక్షల కోట్లు)కు చేరింది.

  • అంతర్జాతీయ కుబేరుల్లో భారత్‌ 1% మందికే ప్రాతినిధ్యం వహిస్తోంది.
  • 2025 కల్లా భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 81.8 శాతం పెరిగి 13 లక్షలకు చేరుకోవచ్చని అంచనా.
  • గతేడాది ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య 52 లక్షలు పెరిగి 5.61 కోట్లకు చేరింది. వీరి సంపద విలువ 28.7 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 418.3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
  • 2020లో సగటున భారత్‌లో ప్రతి యువకుడు/యువతి వద్ద 14,252 డాలర్ల సంపద ఉంది. ఇది 2000 నుంచి సగటున ఏటా 8.8% మేర పెరుగుతూ వచ్చింది. ప్రపంచ సగటు 4.8 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ.
  • 50 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ నికర సంపద ఉన్న ధనవంతులు 4320 మంది వరకు దేశంలో ఉన్నారు.

ముకేశ్‌ సంపాదన.. గంటకు రూ.90 కోట్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ గంటకు రూ.90 కోట్ల చొప్పున 2020లో మొత్తం రూ.2,77,700 కోట్లు సంపాదించడంతో మొత్తం ఆయన సంపద రూ.6,58,400 కోట్లకు చేరిందని హూరన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ చెబుతోంది.

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ అదానీ సంపద మే మధ్య నాటికి 16.2 బిలియన్‌ డాలర్లు పెరిగి 67.6 బిలియన్‌ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్‌ అంటోంది.

ఇదీ చదవండి : రూ.కోట్లు కురిపిస్తున్న 'మీమ్స్'​- అమ్మేయండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.