రంగారెడ్డి, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. నల్గొండలో స్వల్ప ఉద్రికత్త చోటు చేసుకొగా... మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ సాగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు జోరందుకుంది. క్యాంపుల నుంచి వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నేరుగా పొలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల అధికారులు పోలింగ్ కేంద్రాలలో మంచినీరు, నడవలేని వారో కోనం వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా...పోలీసులు కట్టుదిట్టమైన భదత్రను ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాలను వివిధ పార్టీల అభ్యర్థులు సందర్శించి...పోలింగ్ సరళిని పరిశీలించారు.
రంగారెడ్డి జిల్లాలో తెరాస అభ్యర్థి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నల్గొండలో తెరాస నుంచి తేరా చిన్నపరెడ్డి, హస్తం నేత కోమటిరెడ్డి లక్ష్మి బరిలో నిలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెరాస నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 98.88 శాతం, నల్గొండలో 98.80 శాతం , వరంగల్లో 97.89 శాతం పోలింగ్ నమోదైయింది. జూన్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇవీ చూడండి:'తెలంగాణ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా'