ఇవీ చూడండి:పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!
గాంధీభవన్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ
కాంగ్రెస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించినందున... గాంధీభవన్లో సీఎల్పీ అత్యవసర భేటీ అయింది. శాసనసభాపక్ష నేత భట్టి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ
గాంధీభవన్లో కాంగ్రెస్ శాసనసభాపక్షంఅత్యవసర భేటీ అయింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో హస్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్ వ్యవహరాల బాధ్యుడు ఆర్సీ కుంతియా, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్కతోపాటు.. ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి, షబ్బీర్అలీ పాల్గొన్నారు. పార్టీ వీడుతున్న పదిమంది ఎమ్మెల్యేల వ్యవహారం, పార్లమెంటు ఎన్నికల ప్రచారం, రాహుల్, ఇతర ప్రముఖుల పర్యటనపై చర్చించారని తెలుస్తోంది.
ఇవీ చూడండి:పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!
Last Updated : Mar 29, 2019, 5:03 PM IST