ETV Bharat / bharat

నడుస్తున్న రైలులో యువతి హత్య

మధ్యప్రదేశ్​లోని సీహోర్​లో దారుణం జరిగింది. ఇందోర్​ నుంచి బిలాస్​పుర్ వెళ్తున్న రైళ్లో ఓ యువతిని లైంగిక వేధించి.. అనంతరం గొంతు కోసి హత్య చేశారు దుండగులు.

author img

By

Published : Jun 2, 2021, 8:04 AM IST

Young woman killed in running train
నడుస్తున్న రైలులో యువతిపై వేధింపులు

నడుస్తున్న రైలులో ఓ యువతిని లైంగిక వేధింపుల అనంతరం గొంతు కోసి హత్య చేశారు దుండగులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని సీహోర్​లో జరిగింది.

ఇందోర్​-బిలాస్​పుర్​ మధ్య ప్రయాణిస్తున్న రైలు సీహోర్ స్టేషన్​కు చేరుకుంటుండగా.​. కొందరు దుండగులు ఓ 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించారు. అక్కడి నుంచి యువతి ప్రయాణికులవైపు పరుగెత్తగా.. ఓ దుండగుడు పదునైన ఆయుధంతో ఆమె గోంతు కోశాడని ఇతర ప్రయాణికులు తెలిపారు.

వేధింపుల గురించి బాధితురాలి సోదరుడు.. పోలీసులకు ఫోన్​ చేసి సమాచారం ఇచ్చాడు. అయితే తాము సీహోర్ స్టేషన్​కు చేరుకునేలోపే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.

'యువతి తండ్రి ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రిని బయటికి తీసుకురావడానికి బాధితురాలు ప్రయత్నిస్తోంది. ఆమె తల్లి మరణించింది. సోదరుడిని కలవడానికి బాధితురాలు ఇందోర్​ నుంచి భోపాల్​కు వెళుతోంద'ని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి: రూ.2 కోట్ల గంజాయి పట్టివేత-ఇద్దరి అరెస్ట్

నడుస్తున్న రైలులో ఓ యువతిని లైంగిక వేధింపుల అనంతరం గొంతు కోసి హత్య చేశారు దుండగులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని సీహోర్​లో జరిగింది.

ఇందోర్​-బిలాస్​పుర్​ మధ్య ప్రయాణిస్తున్న రైలు సీహోర్ స్టేషన్​కు చేరుకుంటుండగా.​. కొందరు దుండగులు ఓ 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించారు. అక్కడి నుంచి యువతి ప్రయాణికులవైపు పరుగెత్తగా.. ఓ దుండగుడు పదునైన ఆయుధంతో ఆమె గోంతు కోశాడని ఇతర ప్రయాణికులు తెలిపారు.

వేధింపుల గురించి బాధితురాలి సోదరుడు.. పోలీసులకు ఫోన్​ చేసి సమాచారం ఇచ్చాడు. అయితే తాము సీహోర్ స్టేషన్​కు చేరుకునేలోపే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.

'యువతి తండ్రి ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రిని బయటికి తీసుకురావడానికి బాధితురాలు ప్రయత్నిస్తోంది. ఆమె తల్లి మరణించింది. సోదరుడిని కలవడానికి బాధితురాలు ఇందోర్​ నుంచి భోపాల్​కు వెళుతోంద'ని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి: రూ.2 కోట్ల గంజాయి పట్టివేత-ఇద్దరి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.