నడుస్తున్న రైలులో ఓ యువతిని లైంగిక వేధింపుల అనంతరం గొంతు కోసి హత్య చేశారు దుండగులు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సీహోర్లో జరిగింది.
ఇందోర్-బిలాస్పుర్ మధ్య ప్రయాణిస్తున్న రైలు సీహోర్ స్టేషన్కు చేరుకుంటుండగా.. కొందరు దుండగులు ఓ 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించారు. అక్కడి నుంచి యువతి ప్రయాణికులవైపు పరుగెత్తగా.. ఓ దుండగుడు పదునైన ఆయుధంతో ఆమె గోంతు కోశాడని ఇతర ప్రయాణికులు తెలిపారు.
వేధింపుల గురించి బాధితురాలి సోదరుడు.. పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అయితే తాము సీహోర్ స్టేషన్కు చేరుకునేలోపే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.
'యువతి తండ్రి ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రిని బయటికి తీసుకురావడానికి బాధితురాలు ప్రయత్నిస్తోంది. ఆమె తల్లి మరణించింది. సోదరుడిని కలవడానికి బాధితురాలు ఇందోర్ నుంచి భోపాల్కు వెళుతోంద'ని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: రూ.2 కోట్ల గంజాయి పట్టివేత-ఇద్దరి అరెస్ట్