ETV Bharat / bharat

స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ఆధిపత్యం

author img

By

Published : Oct 13, 2021, 6:53 AM IST

తమిళనాడులోని స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Election Tamil Nadu) అధికార పార్టీకే ఆధిక్యం దక్కింది. పంచాయతీ యూనియన్​ వార్డుల్లో కూడా 234 స్థానాల్లో డీఎంకే విజయం సాధించింది. జిల్లా పంచాయతీ వార్డులు, సహా పంచాయతీ యూనియన్​ వార్డుల్లో ప్రత్యర్థి అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ తగిలింది.

dmk
స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ఆధిపత్యం

తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Election Tamil Nadu) డీఎంకే ఆధిపత్యం చెలాయించింది. అక్టోబరు 6, 9 తేదీల్లో తొమ్మిది జిల్లాల్లో విడతల వారీగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. కౌంటింగ్​ ప్రారంభం నుంచే (Local Body Election Tamil Nadu) డీఎంకే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మంగళవారం రాత్రి 10:30 వరకు జిల్లా పంచాయతీ వార్డుల్లో 11 స్థానాల్లో గెలుపొందగా మరో 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పంచాయతీ యూనియన్​ వార్డుల్లో కూడా 234 స్థానాల్లో విజయం సాధించింది. మరో 149 స్థానాల్లో ముందంజలో ఉంది.

మరోవైపు అన్నాడీఎంకేకు ఈ ఎన్నికల్లో (Local Body Election Tamil Nadu) ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పంచాయతీ వార్డుల్లో 4 స్థానాలు.. పంచాయతీ యూనియన్​ వార్డుల్లో 31 స్థానాల్లో గెలుపొందగా.. 26 స్థానాల్లో మాత్రమే ఆధిపత్యం కొనసాగించగలిగింది.

పంచాయతీ యూనియన్​ వార్డుల్లో కాంగ్రెస్​కు 8 స్థానాలు, సీపీఐ(ఎం)కు మూడు స్థానాలు దక్కాయి. భాజపా, సీపీఐ, డీఎండీఎంకే పార్టీలు ఒక్కో స్థానంతో సరిపెట్టుకున్నాయి.

రాష్ట్రంలోని కాంచీపురం, చెంగళ్​పట్టు, తెనకాశీ, వెల్లూర్​, రాణిపేట్​, తిరుపట్టూర్​, తిరునెళ్​వేళీ, విల్లుపురం, కల్లకురిచీ జిల్లాలో ఎన్నికలు జరిగాయి.

ఇదీ చూడండి : భాజపా అభ్యర్థికి షాక్- ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు!

తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Election Tamil Nadu) డీఎంకే ఆధిపత్యం చెలాయించింది. అక్టోబరు 6, 9 తేదీల్లో తొమ్మిది జిల్లాల్లో విడతల వారీగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. కౌంటింగ్​ ప్రారంభం నుంచే (Local Body Election Tamil Nadu) డీఎంకే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మంగళవారం రాత్రి 10:30 వరకు జిల్లా పంచాయతీ వార్డుల్లో 11 స్థానాల్లో గెలుపొందగా మరో 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పంచాయతీ యూనియన్​ వార్డుల్లో కూడా 234 స్థానాల్లో విజయం సాధించింది. మరో 149 స్థానాల్లో ముందంజలో ఉంది.

మరోవైపు అన్నాడీఎంకేకు ఈ ఎన్నికల్లో (Local Body Election Tamil Nadu) ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పంచాయతీ వార్డుల్లో 4 స్థానాలు.. పంచాయతీ యూనియన్​ వార్డుల్లో 31 స్థానాల్లో గెలుపొందగా.. 26 స్థానాల్లో మాత్రమే ఆధిపత్యం కొనసాగించగలిగింది.

పంచాయతీ యూనియన్​ వార్డుల్లో కాంగ్రెస్​కు 8 స్థానాలు, సీపీఐ(ఎం)కు మూడు స్థానాలు దక్కాయి. భాజపా, సీపీఐ, డీఎండీఎంకే పార్టీలు ఒక్కో స్థానంతో సరిపెట్టుకున్నాయి.

రాష్ట్రంలోని కాంచీపురం, చెంగళ్​పట్టు, తెనకాశీ, వెల్లూర్​, రాణిపేట్​, తిరుపట్టూర్​, తిరునెళ్​వేళీ, విల్లుపురం, కల్లకురిచీ జిల్లాలో ఎన్నికలు జరిగాయి.

ఇదీ చూడండి : భాజపా అభ్యర్థికి షాక్- ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.