ETV Bharat / bharat

ఒకే పాముకు తోబుట్టువులు బలి.. రెండు రోజుల వ్యవధిలో...

పాము కాటుకు(snake bite news) అక్క, తమ్ముడు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరినీ ఒకే పాము కాటువేసిన ఈ విషాద సంఘటన మహారాష్ట్ర సాంగలీ జిల్లాలో జరిగింది.

author img

By

Published : Oct 18, 2021, 4:37 PM IST

Siblings have died
తోబుట్టువులను బలితీసుకున్న పాము

పాము కాటుకు(snake bite news) గురై ప్రాణాలు కోల్పోయిన తమ్ముడి అంత్యక్రియలకు హాజరైన అతని సోదరి సైతం అదే పాము కాటుకు బలైంది. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర సాంగలీ జిల్లాలో జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే తోబుట్టువులు ఒకే పాము కాటుకు(snake bite treatment) గురికావటం వారి గ్రామంలో కలకలం సృష్టించింది.

ఏం జరిగింది..?

జిల్లాలోని ఖానాపుర్​ తాలూకా ఆల్సంద్​ గ్రామానికి చెందిన రైతు సునిల్​ కదమ్ ప్రస్తుతం టైలరింగ్​ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అక్టోబర్​ 6న అతని కుమారుడు విరాజ్​ సునిల్​ కదమ్​(16).. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి పాము కాటు వేసింది. తెల్లవారే వరకు అతనికి ఏం జరిగిందో తెలుసుకోలేకపోయారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

సోదరుడి అత్యక్రియలకు హాజరైన పెద్ద కూతురు సాయలీ జాదవ్(22)​ను అక్టోబర్​ 8న అదే పాము కాటు వేసింది. ఆమెను ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి(snake bite treatment) తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ.. అక్టోబర్​ 15న ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు ఏడాది వయసున్న కూతురు ఉంది.

ఇదీ చూడండి: వంట పాత్రలో మండపానికి వధూవరులు- వరద మధ్యే పెళ్లి

పాము కాటుకు(snake bite news) గురై ప్రాణాలు కోల్పోయిన తమ్ముడి అంత్యక్రియలకు హాజరైన అతని సోదరి సైతం అదే పాము కాటుకు బలైంది. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర సాంగలీ జిల్లాలో జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే తోబుట్టువులు ఒకే పాము కాటుకు(snake bite treatment) గురికావటం వారి గ్రామంలో కలకలం సృష్టించింది.

ఏం జరిగింది..?

జిల్లాలోని ఖానాపుర్​ తాలూకా ఆల్సంద్​ గ్రామానికి చెందిన రైతు సునిల్​ కదమ్ ప్రస్తుతం టైలరింగ్​ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అక్టోబర్​ 6న అతని కుమారుడు విరాజ్​ సునిల్​ కదమ్​(16).. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి పాము కాటు వేసింది. తెల్లవారే వరకు అతనికి ఏం జరిగిందో తెలుసుకోలేకపోయారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

సోదరుడి అత్యక్రియలకు హాజరైన పెద్ద కూతురు సాయలీ జాదవ్(22)​ను అక్టోబర్​ 8న అదే పాము కాటు వేసింది. ఆమెను ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి(snake bite treatment) తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ.. అక్టోబర్​ 15న ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు ఏడాది వయసున్న కూతురు ఉంది.

ఇదీ చూడండి: వంట పాత్రలో మండపానికి వధూవరులు- వరద మధ్యే పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.