ETV Bharat / bharat

Samruddhi Expressway Accident : గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. నాలుగు నెలల చిన్నారి సహా 12 మంది స్పాట్ డెడ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 6:39 AM IST

Updated : Oct 15, 2023, 12:32 PM IST

Samruddhi Expressway Accident : దేశంలోని రోడ్లు రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో 20 మంది మరణించారు. వీరంతా గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదాలు జరిగాయి.

Samruddhi Expressway Accident
Samruddhi Expressway Accident

Samruddhi Expressway Accident : దైవ దర్శనాలకు వెళ్లి వస్తూ వేర్వేరు ఘటనల్లో 20 మంది మరణించారు. మహారాష్ట్రలో సమృద్ధి ఎక్స్​ప్రెస్​వేపై ట్రావెలర్​ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో నాలుగు నెలల చిన్నారి సహా 12 మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరోవైపు తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో 8 మంది యాత్రికులు మరణించారు.

గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం..
మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు. సమృద్ధి ఎక్స్​ప్రెస్​వే పై ట్రావెలర్​ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో నాలుగు నెలల చిన్నారి సహా 12 మంది అక్కడిక్కడే మృతిచెందారు. వీరంతా సైలాని బాబా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమృద్ధి ఎక్స్​ప్రెస్ వేపై ఉన్న జంబార్​ టోల్​బూత్​ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

Maharashtra Road Accident : నాశిక్ జిల్లాలోని ఇందిరానగర్​కు చెందిన యాత్రికులు బుల్దానాలోని సైలానీ బాబా దర్శనానికి వెళ్లారు. శనివారం దర్శనం చేసుకున్నాక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మరోవైపు శనివారం అర్ధరాత్రి సమృద్ధి ఎక్స్​ప్రెస్​ వేపై ఉన్న జంబూర్ టోల్​బూత్​ సమీపంలో ఆర్​టీఓ పలు వాహానాలను నిలిపివేశారు. ఈ క్రమంలోనే యాత్రికులతో వస్తున్న ట్రావెలర్​ బస్​.. ట్రక్కును వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి, డ్రైవర్ సహా బస్సులోని 12 మంది అక్కడిక్కడే మరణించారు. ప్రమాద శబ్దాలు విన్న స్థానికులు.. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఘాటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రధాని మోదీ తీవ్ర సంతాపం
ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎంఆర్​ఎఫ్ కింద రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే రూ.5 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

  • Pained by the loss of lives due to an accident in Chhatrapati Sambhajinagar district. My thoughts are with those who lost their loved ones. I wish the injured a speedy recovery. An ex-grata of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured… https://t.co/Q7lrUy5gMH pic.twitter.com/vSujDd2Aea

    — ANI (@ANI) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Pained by the loss of lives due to an accident in Chhatrapati Sambhajinagar district. My thoughts are with those who lost their loved ones. I wish the injured a speedy recovery. An ex-grata of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured… https://t.co/Q7lrUy5gMH pic.twitter.com/vSujDd2Aea

— ANI (@ANI) October 15, 2023
  • Maharashtra CM Eknath Shinde announces Rs 5 lakhs ex-gratia to the families of the victims. The expense of treating the injured will be borne by the govt: Maharashtra CMO https://t.co/Q7lrUy5gMH

    — ANI (@ANI) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తమిళనాడులో మరో 8 మంది మృతి
రహదారి ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన తమిళనాడులోని తిరువన్నామలైలో జరిగింది. బెంగళూరుకు వెళ్తోన్న ఓ కారును ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఘటనలో కారు తుక్కుతుక్కు అయింది. కారులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ మరో మహిళను చెంగం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. వీరంతా దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

  • VIDEO | Several killed after a car collided with a truck near Pakkiripalayam in Tiruvannamalai, Tamil Nadu earlier today. pic.twitter.com/o4NBKSdR7X

    — Press Trust of India (@PTI_News) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Woman Dead Body carried On Doli : డబ్బుల్లేక డోలీలో శ్మశానానికి మృతదేహం తరలింపు.. కంటతడి పెట్టిస్తున్న వైరల్​ వీడియో

Bihar Train Accident 2023 : 'భారీ కుదుపులు.. ప్రయాణికుల అరుపులు.. కళ్లు తెరిచిచూసేసరికి పొలాల్లో..'

Samruddhi Expressway Accident : దైవ దర్శనాలకు వెళ్లి వస్తూ వేర్వేరు ఘటనల్లో 20 మంది మరణించారు. మహారాష్ట్రలో సమృద్ధి ఎక్స్​ప్రెస్​వేపై ట్రావెలర్​ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో నాలుగు నెలల చిన్నారి సహా 12 మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరోవైపు తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో 8 మంది యాత్రికులు మరణించారు.

గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం..
మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు. సమృద్ధి ఎక్స్​ప్రెస్​వే పై ట్రావెలర్​ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో నాలుగు నెలల చిన్నారి సహా 12 మంది అక్కడిక్కడే మృతిచెందారు. వీరంతా సైలాని బాబా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమృద్ధి ఎక్స్​ప్రెస్ వేపై ఉన్న జంబార్​ టోల్​బూత్​ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

Maharashtra Road Accident : నాశిక్ జిల్లాలోని ఇందిరానగర్​కు చెందిన యాత్రికులు బుల్దానాలోని సైలానీ బాబా దర్శనానికి వెళ్లారు. శనివారం దర్శనం చేసుకున్నాక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మరోవైపు శనివారం అర్ధరాత్రి సమృద్ధి ఎక్స్​ప్రెస్​ వేపై ఉన్న జంబూర్ టోల్​బూత్​ సమీపంలో ఆర్​టీఓ పలు వాహానాలను నిలిపివేశారు. ఈ క్రమంలోనే యాత్రికులతో వస్తున్న ట్రావెలర్​ బస్​.. ట్రక్కును వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి, డ్రైవర్ సహా బస్సులోని 12 మంది అక్కడిక్కడే మరణించారు. ప్రమాద శబ్దాలు విన్న స్థానికులు.. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఘాటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రధాని మోదీ తీవ్ర సంతాపం
ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎంఆర్​ఎఫ్ కింద రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే రూ.5 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

  • Pained by the loss of lives due to an accident in Chhatrapati Sambhajinagar district. My thoughts are with those who lost their loved ones. I wish the injured a speedy recovery. An ex-grata of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured… https://t.co/Q7lrUy5gMH pic.twitter.com/vSujDd2Aea

    — ANI (@ANI) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Maharashtra CM Eknath Shinde announces Rs 5 lakhs ex-gratia to the families of the victims. The expense of treating the injured will be borne by the govt: Maharashtra CMO https://t.co/Q7lrUy5gMH

    — ANI (@ANI) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తమిళనాడులో మరో 8 మంది మృతి
రహదారి ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన తమిళనాడులోని తిరువన్నామలైలో జరిగింది. బెంగళూరుకు వెళ్తోన్న ఓ కారును ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఘటనలో కారు తుక్కుతుక్కు అయింది. కారులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ మరో మహిళను చెంగం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. వీరంతా దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

  • VIDEO | Several killed after a car collided with a truck near Pakkiripalayam in Tiruvannamalai, Tamil Nadu earlier today. pic.twitter.com/o4NBKSdR7X

    — Press Trust of India (@PTI_News) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Woman Dead Body carried On Doli : డబ్బుల్లేక డోలీలో శ్మశానానికి మృతదేహం తరలింపు.. కంటతడి పెట్టిస్తున్న వైరల్​ వీడియో

Bihar Train Accident 2023 : 'భారీ కుదుపులు.. ప్రయాణికుల అరుపులు.. కళ్లు తెరిచిచూసేసరికి పొలాల్లో..'

Last Updated : Oct 15, 2023, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.