పుదుచ్చేరి సీఎం ఎవరనే విషయంపై ఇప్పటివరకు నెలకొన్న సంధిగ్ధం వీడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ భాజపా ఎమ్మెల్యేలు సైతం సంతకాలు చేసిన లేఖను ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకి ఎన్నార్ కాంగ్రెస్ అధినేత రంగసామి అందించారు. దీంతో ఆయన ప్రమాణానికి సమయం కేటాయించనున్నట్టు గవర్నర్ తెలిపారు.
పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయదుందుభి మోగించింది. మొత్తం 30 స్థానాల్లో 16 స్థానాలు కూటమి సొంతం చేసుకుని మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. భాజపా ఆరు స్థానాల్లో గెలిచింది.
ఇదీ చదవండి:యూపీ సీఎంను చంపుతానని బెదిరింపు