ETV Bharat / bharat

'టీకాపై అసత్యాలకు అడ్డుకట్ట వేయండి'

author img

By

Published : Jan 24, 2021, 5:19 PM IST

Updated : Jan 24, 2021, 7:17 PM IST

గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనే ఎన్​​సీసీ క్యాడెట్లు ,ఎన్​​ఎస్​ఎస్​ వలంటీర్లుతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం అయ్యారు. వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మోదీ పాల్లొన్నారు. టీకా పంపిణీలో భాగం కావాలని వారికి సూచించారు మోదీ.

PM Modi interacts with the NCC cadets, NSS volunteers and artists participating in Republic Day Parade.
'టీకా పంపిణీలో భాగం కావాలి'

కరోనాను జయించేందుకు భారతీయ శాస్త్రవేత్తలు టీకాను అభివృద్ధి చేసి వారి బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. అయితే ప్రస్తుతం టీకా సమర్థత, పని తీరుపై వస్తోన్న వదంతులకు యువతే అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు.

గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనేందుకు దేశం నలుదిశల నుంచి వచ్చిన ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​ వలంటీర్లతో దిల్లీలో ప్రధాని సమావేశమయ్యారు. కష్టకాలంలో ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాయని కితాబిచ్చారు. కరోనా సమయంలోనూ ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​లో ఉండే వారు అందించిన సేవలు గొప్పవని ప్రధాని కొనియాడారు. ప్రభుత్వాలకు అవసరం అన్న ప్రతిసారీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. మేమున్నాం అంటూ ముందుకు వచ్చినట్లు గుర్తు చేశారు.

సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన ప్రధాని
PM Modi interacts with the NCC cadets, NSS volunteers and artists participating in Republic Day Parade.
జాతీయ జెండాను ప్రదర్శిస్తోన్న ఎన్​సీసీ క్యాడెట్లు
PM Modi interacts with the NCC cadets, NSS volunteers and artists participating in Republic Day Parade.
ఎన్​​ఎస్​ఎస్​ వలంటీర్ల నృత్య ప్రదర్శన
PM Modi interacts with the NCC cadets, NSS volunteers and artists participating in Republic Day Parade.
సాంస్కృతిక కార్యక్రమానికి హజరైన అతిథులు

"యువత ముందుకు రావాల్సిన సమయం ఇది. టీకాల సమర్థతపై నెలకొన్న అనుమానాలను మీరే తొలగించాలి. సమాజంలో మీ భాగస్వామ్యం ఎక్కువ ఉంది. టీకాపై వస్తున్న అపోహలను తొలగిస్తూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు సరైన సమాచారాన్ని అందించాలి. ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సింది మీరే. ఆత్మనిర్భర భారత్​ మీతోనే సాకారం అవుతోంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

రిపబ్లిక్ డే పరేడ్​లో ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు.. దేశం ఔనత్యాన్ని, సామాజిక, సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అయోధ్య రామాలయ నిర్మాణ వ్యయం రూ.1100కోట్లు!

కరోనాను జయించేందుకు భారతీయ శాస్త్రవేత్తలు టీకాను అభివృద్ధి చేసి వారి బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. అయితే ప్రస్తుతం టీకా సమర్థత, పని తీరుపై వస్తోన్న వదంతులకు యువతే అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు.

గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనేందుకు దేశం నలుదిశల నుంచి వచ్చిన ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​ వలంటీర్లతో దిల్లీలో ప్రధాని సమావేశమయ్యారు. కష్టకాలంలో ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాయని కితాబిచ్చారు. కరోనా సమయంలోనూ ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​లో ఉండే వారు అందించిన సేవలు గొప్పవని ప్రధాని కొనియాడారు. ప్రభుత్వాలకు అవసరం అన్న ప్రతిసారీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. మేమున్నాం అంటూ ముందుకు వచ్చినట్లు గుర్తు చేశారు.

సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన ప్రధాని
PM Modi interacts with the NCC cadets, NSS volunteers and artists participating in Republic Day Parade.
జాతీయ జెండాను ప్రదర్శిస్తోన్న ఎన్​సీసీ క్యాడెట్లు
PM Modi interacts with the NCC cadets, NSS volunteers and artists participating in Republic Day Parade.
ఎన్​​ఎస్​ఎస్​ వలంటీర్ల నృత్య ప్రదర్శన
PM Modi interacts with the NCC cadets, NSS volunteers and artists participating in Republic Day Parade.
సాంస్కృతిక కార్యక్రమానికి హజరైన అతిథులు

"యువత ముందుకు రావాల్సిన సమయం ఇది. టీకాల సమర్థతపై నెలకొన్న అనుమానాలను మీరే తొలగించాలి. సమాజంలో మీ భాగస్వామ్యం ఎక్కువ ఉంది. టీకాపై వస్తున్న అపోహలను తొలగిస్తూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు సరైన సమాచారాన్ని అందించాలి. ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సింది మీరే. ఆత్మనిర్భర భారత్​ మీతోనే సాకారం అవుతోంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

రిపబ్లిక్ డే పరేడ్​లో ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు.. దేశం ఔనత్యాన్ని, సామాజిక, సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అయోధ్య రామాలయ నిర్మాణ వ్యయం రూ.1100కోట్లు!

Last Updated : Jan 24, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.