ఆన్లైన్ రుణాల కుంభకోణానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. బెంగళూరు కేంద్రంగా కిండల్ టెక్నాలజీస్ అనే సంస్థ 100మంది ఉద్యోగులతో ఈ మోసానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ సంస్థను నిర్వహిస్తున్న ప్రేమలత, భవన్ను సీబీసీఐడీ బృందం అరెస్టు చేసింది. ఈ కుంభకోణానికి సూత్రధారులైన చైనీయులు జియోవా యమావ్, వు యువాన్లుమ్ను కూడా అదుపులోకి తీసుకుంది.
ఆన్లైన్ ఇన్స్టంట్ లోన్ యాప్ల కోసం 600 సిమ్ కార్డులను కిండల్ టెక్నాలజీస్ వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంస్థలో మొత్తం 150మంది ఉద్యోగులున్నట్లు పేర్కొన్నారు. ఈ కుంభకోణం మొత్తానికి ప్రధాన సూత్రధారి చైనాకు చెందిన హాంగ్ అని వెల్లడించారు. చైనాలో ఉంటూనే 'డింగ్ డాంగ్' యాప్ను ఉపయోగించిన ఇక్కడి రుణయాప్లను రోజూ పరిశీలిస్తునట్లు చెప్పారు.
ఇదీ చూడండి: అంగన్వాడీ కార్యకర్త గ్యాంగ్ రేప్- అవయవాలు ఛిద్రం