హెల్మట్ లేదంటూ ఓ ట్రక్కు డైవర్కు అధికారులు రూ.1000 జరిమానా విధించారు. ఈ ఘటన ఈనెల 12న ఒడిశాలోని గంజాం జిల్లా బర్హంపుర్ పట్టణంలో జరిగింది.
ఇదీ జరిగింది..
బర్హంపుర్లోని జి.జగన్నాథపుర్కు చెందిన ప్రమోద్ కుమార్ స్వైన్ ఈనెల 12న తన వాహనం పర్మిట్ రిన్యూవల్ చేయించేందుకు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అధికారులు అతనికి చలానా అందించారు. గతేడాది డిసెంబరు 24న బెర్హంపుర్ ట్రాఫిక్ పోలీసులు విధించిన ఈ చలానాలో.. ప్రమోద్ తన ట్రక్కును హెల్మెట్ లేకుండా నడుపుతున్నాడని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ప్రైవేటు బస్సు బోల్తా - 16మందికి గాయాలు