ఆల్ ఇండియా నేషనల్ రీజినల్ కాంగ్రెస్ పార్టీ(ఏఐఎన్ఆర్సీ) అధినేత ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. సీఎం బాధ్యతలు చేపట్టడం ఆయనకు ఇది నాలుగోసారి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. సరైన పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగాయి. ఎఐఎన్ఆర్సీ, భాజపా కలిసి ఎన్డీఏగా బరిలోకి దిగి 16 స్థానాలు కైవసం చేసుకున్నాయి. వాటిలో రంగస్వామి పార్టీ 10 సీట్లు, కమలం పార్టీ 6 సీట్లు గెలుపొందాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ను అందుకున్నాయి. అధికార కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితం కాగా, డీఎంకే 6 స్థానాల్లో గెలిచింది.


నాలుగోసారి..
కాంగ్రెస్లో ఉన్నప్పుడు 2001 నుంచి 2008 వరకు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు రంగస్వామి. ఆ తర్వాత 2011లో హస్తం పార్టీని వీడి బయటకొచ్చి ఏఐఎన్ఆర్సీ పార్టీని స్థాపించారు. మూడు నెలల్లోనే తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించారు. 2011నుంచి 2016వరకు సీఎంగా ఉన్నారు. 2016లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. తాజాగా ఆ కూటమిని ఓడించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని రంగస్వామి అధిరోహించారు.
ఇదీ చూడండి: ఆ ఫైల్పై సీఎంగా స్టాలిన్ తొలి సంతకం