ETV Bharat / bharat

MP Election Parmanand Tolani : ఎన్నికల్లో 18 సార్లు ఓటమి.. మరోసారి పోటీకి సై.. పట్టువదలని విక్రమార్కుడిగా..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 10:16 AM IST

MP Election Parmanand Tolani : 35 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ఓటమి చవి చూస్తున్న వెనక్కి తగ్గకుండా ఓ వ్యక్తి పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి బరిలోకి దిగారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన పర్మానంద్‌ తోలని 18 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ప్రతిసారి డిపాజిట్లను కోల్పోయారు. అయినా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పర్మానంద్ తోలని నామినేషన్‌ దాఖలు చేశారు.

MP Election Parmanand Tolani
MP Election Parmanand Tolani

MP Election Parmanand Tolani : మధ్యప్రదేశ్‌కు చెందిన ఇందౌర్‌ నివాసి పర్మానంద్‌ తోలని వివిధ ఎన్నికల్లో 18 సార్లు ఓటమి పాలయ్యారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. 19వ సారి నామినేషన్‌ వేశారు. 63 ఏళ్ల వయసు ఉన్న పర్మానంద్‌ తన తండ్రి 1988లో మరణించగా.. తర్వాతి సంవత్సరం నుంచి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తెలిపారు.

డిపాజిట్లు కూడా..
పోటీ చేసిన అన్నీ ఎన్నికల్లోనూ ఆయనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. వరుస పరాజయాలతో ఇందౌర్‌ ధర్తి పకడ్‌ అనే బిరుదును పర్మానంద్‌ సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల తన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపిన పర్మానంద్‌.. నవంబర్ 17న జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇందౌర్-4 స్థానం నుంచి ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

MP Election Parmanand Tolani
నామినేషన్​ దాఖలు చేస్తున్న పర్మానంద్‌ తోలని(పాత చిత్రం)

30 ఏళ్ల పాటు ఎన్నికల్లో తండ్రి పోటీ.. ఇప్పుడు కుమారుడు..
Who is Parmanand Tolani : పర్మానంద్‌ తోలని కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. గతంలో తన తండ్రి ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుతూ 30 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేశారని.. తర్వాత దానిని తాను కొనసాగిస్తున్నానని పర్మానంద్‌ తెలిపారు. పర్మానంద్‌ కుటుంబ సభ్యులు కూడా కొన్ని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. తన భార్య గతంలో మేయర్‌ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైందని ఆయన తెలిపారు.

ఓటర్లపై హామీల వర్షం!
ఇంత మంది తన కుంటుబం నుంచి పోటీ చేసిన ఏ ఒక్కరూ గెలుపొందలేదని పర్మానంద్‌ పేర్కొన్నారు. అయినా వెనుకంజ వేయకుండా.. తనే కాదు.. తన తర్వాతి తరం కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే.. 1000 చదరపు అడుగుల భవనాలపై పూర్తిగా ఆస్తి పన్ను మినహాయించడం సహా నగరపాలక సంస్థ వసూలు చేసే పన్నులను రద్దు చేస్తానని పర్మానంద్‌ ఓటర్లకు హామీ ఇస్తున్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 21
  • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 30
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 31
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 2
  • మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 17
  • ఫలితాల లెక్కింపు తేదీ: డిసెంబర్ 3


22 Crucial Seats In MP : తాడోపేడో తేల్చే ఆ 22 సీట్లు.. ముస్లిం ఓటు బ్యాంక్​పై కాంగ్రెస్ ఆశలు!.. అధికారం కైవసం చేసుకుంటుందా?

Madhya Pradesh Elections Family Battle : మామాఅల్లుళ్లే ప్రత్యర్థులు.. బావామరదళ్ల మధ్య ఢీ.. పరి'వార్'​లో విజయమెవరిదో?

MP Election Parmanand Tolani : మధ్యప్రదేశ్‌కు చెందిన ఇందౌర్‌ నివాసి పర్మానంద్‌ తోలని వివిధ ఎన్నికల్లో 18 సార్లు ఓటమి పాలయ్యారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. 19వ సారి నామినేషన్‌ వేశారు. 63 ఏళ్ల వయసు ఉన్న పర్మానంద్‌ తన తండ్రి 1988లో మరణించగా.. తర్వాతి సంవత్సరం నుంచి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తెలిపారు.

డిపాజిట్లు కూడా..
పోటీ చేసిన అన్నీ ఎన్నికల్లోనూ ఆయనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. వరుస పరాజయాలతో ఇందౌర్‌ ధర్తి పకడ్‌ అనే బిరుదును పర్మానంద్‌ సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల తన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపిన పర్మానంద్‌.. నవంబర్ 17న జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇందౌర్-4 స్థానం నుంచి ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

MP Election Parmanand Tolani
నామినేషన్​ దాఖలు చేస్తున్న పర్మానంద్‌ తోలని(పాత చిత్రం)

30 ఏళ్ల పాటు ఎన్నికల్లో తండ్రి పోటీ.. ఇప్పుడు కుమారుడు..
Who is Parmanand Tolani : పర్మానంద్‌ తోలని కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. గతంలో తన తండ్రి ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుతూ 30 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేశారని.. తర్వాత దానిని తాను కొనసాగిస్తున్నానని పర్మానంద్‌ తెలిపారు. పర్మానంద్‌ కుటుంబ సభ్యులు కూడా కొన్ని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. తన భార్య గతంలో మేయర్‌ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైందని ఆయన తెలిపారు.

ఓటర్లపై హామీల వర్షం!
ఇంత మంది తన కుంటుబం నుంచి పోటీ చేసిన ఏ ఒక్కరూ గెలుపొందలేదని పర్మానంద్‌ పేర్కొన్నారు. అయినా వెనుకంజ వేయకుండా.. తనే కాదు.. తన తర్వాతి తరం కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే.. 1000 చదరపు అడుగుల భవనాలపై పూర్తిగా ఆస్తి పన్ను మినహాయించడం సహా నగరపాలక సంస్థ వసూలు చేసే పన్నులను రద్దు చేస్తానని పర్మానంద్‌ ఓటర్లకు హామీ ఇస్తున్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 21
  • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 30
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 31
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 2
  • మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 17
  • ఫలితాల లెక్కింపు తేదీ: డిసెంబర్ 3


22 Crucial Seats In MP : తాడోపేడో తేల్చే ఆ 22 సీట్లు.. ముస్లిం ఓటు బ్యాంక్​పై కాంగ్రెస్ ఆశలు!.. అధికారం కైవసం చేసుకుంటుందా?

Madhya Pradesh Elections Family Battle : మామాఅల్లుళ్లే ప్రత్యర్థులు.. బావామరదళ్ల మధ్య ఢీ.. పరి'వార్'​లో విజయమెవరిదో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.