ETV Bharat / bharat

తోటి కార్మికుడ్ని కాపాడబోయి ముగ్గురు మృతి - డ్రైనేజ్​లోకి దిగి నలుగురు కార్మికులు మృతి

Maharashtra Drainage Accident: మహారాష్ట్రలోని సోలాపుర్​లో దురదృష్టకర ఘటన జరిగింది. డ్రైనేజ్​ శుభ్రం చేద్దామని మ్యాన్​హోల్​లోకి దిగిన ఓ వ్యక్తి మృతిచెందాడు. అతడిని కాపాడే క్రమంలో మరో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

labourers killed in drainage
డ్రైనేజ్​ శుభ్రం చేస్తుండగా ప్రమాదం-నలుగురు మృతి
author img

By

Published : Dec 24, 2021, 1:07 PM IST

Maharashtra Drainage Accident: డ్రైనేజ్​ శుభ్రం చేసేందుకు మ్యాన్​హోల్​లోకి దిగిన ఓ వ్యక్తి సహా అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపుర్​లో గురువారం సాయంత్రం జరిగింది. మృతుల్లో ముగ్గురిని ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

labourers killed in drainage
మృతదేహాలను వెలికి తీస్తున్న స్థానికులు

కాపాడబోయి...

సోలాపుర్​-అక్కల్​కోట్​ హైవే మార్గంలోని సాదుల్​ పెట్రోల్​ పంప్ వద్ద డ్రైనేజీ నాలాలను.. శుభ్రం చేసే పనులు చేపడుతోంది సోలాపుర్​​ మున్సిపల్ కార్పొరేషన్​. ఈ క్రమంలో మ్యాన్​హోల్​లోకి దిగిన ఓ వ్యక్తి.. ఆక్సిజన్​ అందకపోవడం, విషవాయువులు చుట్టుముట్టడం కారణంగా ఊపిరి తీసుకోలేకపోయాడు. అక్కడే ఉన్న మరో ముగ్గురు మ్యాన్​హోల్​లోకి దిగి అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వారు కూడా అందులో చిక్కుకున్నారు. ఈ నలుగురూ ఆక్సిజన్​ అందక ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో వారిని రక్షించేందుకు మ్యాన్​హోల్​లోకి దిగిన మరో ఇద్దరు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

స్థానికులు వీరిని రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే నలుగురు మృతిచెందారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు ఎలాంటి రక్షణ పరికరాలు ధరించలేదని స్థానికులు వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే వారు ప్రాణాలు కోల్పోయారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్​ కార్పొరేషన్ కమిషనర్​.. దర్యప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మృతులను విశాల్​, బచన్ పరము రిషిదేవ్​, ఆశిష్​ కుమార్​ భరత్​ సింగ్​ రాజ్​పుత్​, సునీల్​ గుల్జారిలాల్​ ధాకా, విశాల్​ హిప్పేర్​కర్​గా గుర్తించారు పోలీసులు. వీరిలో ఒకరు మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాకు చెందిన వారు కాగా మరో ముగ్గురు ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, రాజస్థాన్​ రాష్ట్రాల నుంచి వలస వచ్చారు.

ఇదీ చూడండి : స్టంట్ చేస్తుండగా అదుపు తప్పిన బైక్.. ఎగిరిపడ్డ రైడర్​

Maharashtra Drainage Accident: డ్రైనేజ్​ శుభ్రం చేసేందుకు మ్యాన్​హోల్​లోకి దిగిన ఓ వ్యక్తి సహా అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపుర్​లో గురువారం సాయంత్రం జరిగింది. మృతుల్లో ముగ్గురిని ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

labourers killed in drainage
మృతదేహాలను వెలికి తీస్తున్న స్థానికులు

కాపాడబోయి...

సోలాపుర్​-అక్కల్​కోట్​ హైవే మార్గంలోని సాదుల్​ పెట్రోల్​ పంప్ వద్ద డ్రైనేజీ నాలాలను.. శుభ్రం చేసే పనులు చేపడుతోంది సోలాపుర్​​ మున్సిపల్ కార్పొరేషన్​. ఈ క్రమంలో మ్యాన్​హోల్​లోకి దిగిన ఓ వ్యక్తి.. ఆక్సిజన్​ అందకపోవడం, విషవాయువులు చుట్టుముట్టడం కారణంగా ఊపిరి తీసుకోలేకపోయాడు. అక్కడే ఉన్న మరో ముగ్గురు మ్యాన్​హోల్​లోకి దిగి అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వారు కూడా అందులో చిక్కుకున్నారు. ఈ నలుగురూ ఆక్సిజన్​ అందక ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో వారిని రక్షించేందుకు మ్యాన్​హోల్​లోకి దిగిన మరో ఇద్దరు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

స్థానికులు వీరిని రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే నలుగురు మృతిచెందారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు ఎలాంటి రక్షణ పరికరాలు ధరించలేదని స్థానికులు వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే వారు ప్రాణాలు కోల్పోయారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్​ కార్పొరేషన్ కమిషనర్​.. దర్యప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మృతులను విశాల్​, బచన్ పరము రిషిదేవ్​, ఆశిష్​ కుమార్​ భరత్​ సింగ్​ రాజ్​పుత్​, సునీల్​ గుల్జారిలాల్​ ధాకా, విశాల్​ హిప్పేర్​కర్​గా గుర్తించారు పోలీసులు. వీరిలో ఒకరు మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాకు చెందిన వారు కాగా మరో ముగ్గురు ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, రాజస్థాన్​ రాష్ట్రాల నుంచి వలస వచ్చారు.

ఇదీ చూడండి : స్టంట్ చేస్తుండగా అదుపు తప్పిన బైక్.. ఎగిరిపడ్డ రైడర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.