లోకసభ, రాజ్యసభ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం కోసం ఏర్పాటు చేసిన రెండు టీవీ ఛానళ్లను కలిపేసినట్లు చేసిన రాజ్యసభ సచివాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు ఛానళ్లను కలిపి 'సంసద్ టీవీ' పేరుతో కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపింది.
'సంసద్ టీవీ'కి ముఖ్యకార్య నిర్వహణాధికారి(సీఈఓ)గా ఐఏఎస్ మాజీ అధికారి రవి కపూర్ను నియమించినట్లు రాజ్యసభ సచివాలయం తెలిపింది.
ఇదీ చూడండి:2020లో 9 శాతం పెరిగిన టీవీ వ్యూయర్షిప్