వాతావరణ మార్పులపై చర్చించేందుకు పంపిన అమెరికా ఆహ్వానాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల సమావేశానికి హాజరవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోదీని కోరారు. ఈ నేపథ్యంలో వర్చువల్ వేదికగా ఏప్రిల్ 22-23న జరగనున్న సదస్సుకు హాజరుకానున్నారు మోదీ.
"వాతావరణ మార్పునకు సంబంధించి.. అమెరికా దౌత్యవేత్త జాన్ కెర్రీ ఏప్రిల్ 5 నుంచి 8 వరకు దిల్లీ పర్యటించనున్నారు."
--అరిందమ్ బాగ్చి, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి.
భారత పర్యటనకు ముందు వాతావారణ మార్పులపై చర్చించేందుకు జాన్ కెర్రీ బంగ్లాదేశ్, యూఏఈలో పర్యటించనున్నారు.
ఇదీ చదవండి:తైవాన్ రైలు ప్రమాదం: 48కి పెరిగిన మృతులు