ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా రవుర్కెలకు చెందిన సమీర్ జోజో అనే వ్యక్తికి జీఎస్టీ ఎగవేత కింద అధికారులు నోటీసులు పంపారు. అందులో రూ.70 కోట్ల మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఈ విషయంపై ఆ మెకానిక్ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. ఆరునెలల క్రితం ఓ వ్యక్తి వచ్చి స్థానిక కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన గుర్తింపు పత్రాలు, చెక్కులపై సంతకాలు తీసుకెళ్లాడని చెప్పారు జోజో. ఆ వ్యక్తి ఆ తరువాత మళ్లీ కనిపించలేదన్నారు. అతనే తన పేరట కంపెనీ ఏర్పాటు చేసి పన్ను ఎగవేసి ఉండొచ్చని నోటీసులు ద్వారా తెలుస్తోందని వెల్లడించారు. మెకానిక్గా పనిచేసే తన వద్ద అంత డబ్బు ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేశారు.