ETV Bharat / bharat

'భవిష్యత్​ తరాలకు రైతులు జవాబుదారీ'

author img

By

Published : Apr 5, 2021, 9:42 AM IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్న రైతులు తమ ఆందోళనను అంత త్వరగా వదిలేసి వెళ్లరని భారతీయ కిసాన్​ యూనియన్ అధ్యక్షుడు నరేశ్​ టికాయిత్​ స్పష్టం చేశారు. భవిష్యత్​ తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రైతులపై ఉందని పేర్కొన్నారు. గాజీపుర్​ సరిహద్దు వద్ద ఆయన 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

naresh tikait
'భవిష్యత్​ తరాలకు రైతులు జవాబుదారీ'

సరైన పరిష్కారం దొరకకుండానే రైతులు తమ గ్రామాలకు వెళితే రైతులను రానున్న తరాలు క్షమించవని భారతీయ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు నరేశ్​ టికాయిత్ వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. దిల్లీ సరిహద్దులోని గాజీపుర్ వద్ద నిరసిస్తున్న రైతులను ఆదివారం ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్​'తో మాట్లాడారు.

'ఈటీవీ భారత్​'తో మాట్లాడుతున్న నరేశ్​ టికాయిత్​

రైతులు అంత త్వరగా తమ ఆందోళనను వదిలివేయరని నరేశ్​ టికాయిత్ స్పష్టం చేశారు. ఎందుకంటే.. భవిష్యత్​ తరాలకు తాము సమాధానం చెప్పాల్సి ఉంటుందనే విషయం రైతులకు తెలుసని పేర్కొన్నారు. తన సోదరుడు రాకేశ్​ టికాయిత్​ కాన్వాయ్​పై ఇటీవల జరిగిన దాడికి సంబంధించి అసలైన నిందితులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)​ విద్యార్థులు కారని అన్నారు.

ఇదీ చూడండి:'మరింత ఉద్ధృతంగా నక్సల్స్​ ఏరివేత'

సరైన పరిష్కారం దొరకకుండానే రైతులు తమ గ్రామాలకు వెళితే రైతులను రానున్న తరాలు క్షమించవని భారతీయ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు నరేశ్​ టికాయిత్ వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. దిల్లీ సరిహద్దులోని గాజీపుర్ వద్ద నిరసిస్తున్న రైతులను ఆదివారం ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్​'తో మాట్లాడారు.

'ఈటీవీ భారత్​'తో మాట్లాడుతున్న నరేశ్​ టికాయిత్​

రైతులు అంత త్వరగా తమ ఆందోళనను వదిలివేయరని నరేశ్​ టికాయిత్ స్పష్టం చేశారు. ఎందుకంటే.. భవిష్యత్​ తరాలకు తాము సమాధానం చెప్పాల్సి ఉంటుందనే విషయం రైతులకు తెలుసని పేర్కొన్నారు. తన సోదరుడు రాకేశ్​ టికాయిత్​ కాన్వాయ్​పై ఇటీవల జరిగిన దాడికి సంబంధించి అసలైన నిందితులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)​ విద్యార్థులు కారని అన్నారు.

ఇదీ చూడండి:'మరింత ఉద్ధృతంగా నక్సల్స్​ ఏరివేత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.