ETV Bharat / bharat

బాంబు పేలుడుపై ఇజ్రాయెల్​ మంత్రికి జైశంకర్ ఫోన్​​​

author img

By

Published : Jan 29, 2021, 9:43 PM IST

దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో బాంబు పేలుడంపై ఆ దేశ విదేశాంగ మంత్రితో ఫోన్​లో మాట్లాడారు భారత్​ విదేశాంగ మంత్రి జైశంకర్​. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న జైశంకర్​.. దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఘటనపై ఆరా తీశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

Explosion outside Israeli embassy: EAM Jaishankar speaks to Israeli FM
దిల్లీ పేలుడుపై ఇజ్రాయెల్​ మంత్రికి జైశంకర్ ఫోన్​​​

దిల్లీలో బాంబు పేలుడు ఘటనపై ఇజ్రాయెల్​ విదేశాంగ మంత్రి గాబీ అష్కెనాజీతో ఫోన్​లో మాట్లాడారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్​. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

ఇదే ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. దిల్లీ సీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను అడిగి తెలుసుకున్నారు షా. ఈ సంఘటన తరువాత, మంత్రి దిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

దిల్లీ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి దగ్గరలో బాంబు పేలుడు సంభవించింది.

ఇదీ చూడండి: దిల్లీలో ఐఈడీ పేలుడు- ఎవరి పని?

దిల్లీలో బాంబు పేలుడు ఘటనపై ఇజ్రాయెల్​ విదేశాంగ మంత్రి గాబీ అష్కెనాజీతో ఫోన్​లో మాట్లాడారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్​. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

ఇదే ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. దిల్లీ సీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను అడిగి తెలుసుకున్నారు షా. ఈ సంఘటన తరువాత, మంత్రి దిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

దిల్లీ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి దగ్గరలో బాంబు పేలుడు సంభవించింది.

ఇదీ చూడండి: దిల్లీలో ఐఈడీ పేలుడు- ఎవరి పని?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.