దేశీయ విమాన ప్రయాణాలు మరింత ప్రియం కానున్నాయి. సంస్థలు ఛార్జీలను 15 శాతం పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పౌరవిమానయానశాఖ ప్రకటన విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఈ ఛార్జీలు అమలోకి వస్తాయని పేర్కొంది. గతేడాది మేలో విడుదల చేసిన ఉత్తర్వులను డీజీసీఏ సవరించింది.
దేశంలోని అన్ని మార్గాలను 7 సెక్టార్లుగా విభజించి ఛార్జీలను డీజీసీఏ ఖరారు చేసింది. కనీస ఛార్జీ రూ.2200-7200 మధ్య ఉండనుంది గత మేలో డీజీసీఏ ఖరారు చేసింది. తాజా ఉత్తర్వుల్లో కనీస ఛార్జీ రూ.2600-రూ.7800గా ఖరారు చేసింది. గరిష్ఠ ఛార్జీ రూ.8700-రూ.24200 సెక్టారుకు అనుగుణంగా కనీస ఛార్జీలు ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొంది.
ఇదీ చదవండి : narada case: 'నారదా కేసులో నవ్వుల పాలయ్యాం'