ETV Bharat / bharat

సాధ్వి.. శపిస్తే సరిపోయేది కదా?: దిగ్విజయ్​

జైషే మహ్మద్ ఉగ్రవాద​ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను సాధ్వి ప్రజ్ఞాసింగ్​ ఠాకూర్​ శపించి ఉంటే, భారత్​ లక్షిత దాడులు చేయాల్సిన అవసరమే ఉండేది కాదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్​ సింగ్ ఎద్దేవా చేశారు. భోపాల్​లో లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

author img

By

Published : Apr 28, 2019, 10:57 AM IST

Updated : Apr 28, 2019, 12:47 PM IST

సాధ్వి.. శపిస్తే సరిపోయేది కదా?: దిగ్విజయ్​
సాధ్వి.. శపిస్తే సరిపోయేది కదా?: దిగ్విజయ్​

మధ్యప్రదేశ్​ భోపాల్​లో లోక్​సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్​ సింగ్​... తన ప్రత్యర్థి, భాజపా నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​పై విమర్శలు గుప్పించారు.

ఉగ్రవాదులపై పోరాడి అమరుడైన పోలీసు అధికారి హేమంత్​ కర్కరే తన శాపం వల్లే మరణించారని సాధ్వి ప్రజ్ఞా సింగ్​ లోగడ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఉగ్రదాడికి కారకుడైన మసూద్​ అజార్​ను సాధ్వి ప్రజ్ఞా సింగ్​​ శపించినట్లయితే... లక్షిత దాడులు చేయాల్సిన అవసరమే ఉండేది కాదని ఆయన ఎద్దేవా చేశారు.

భయపడ్డారు...

భోపాల్​లో తనపై పోటీ చేయడానికి భాజపా అభ్యర్థులు భయపడ్డారని దిగ్విజయ్​ సింగ్ అన్నారు. ఉమా భారతి పోటీ చేసేందుకు నిరాకరించారని, గౌర్​ తప్పుకున్నారని చెప్పారు. చివరికి గత్యంతరం లేక నామినేషన్​కు చివరి రోజు సాధ్వి ప్రజ్ఞాసింగ్​ను బరిలో నిలిపారని దిగ్విజయ్​ అన్నారు.

మధ్యప్రదేశ్​ భోపాల్​లో మే 12న పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్లు లెక్కిస్తారు.

ఇదీ చూడండి: 'జిన్నా పేరు ఉచ్ఛరించడం పొరపాటు మాత్రమే'

సాధ్వి.. శపిస్తే సరిపోయేది కదా?: దిగ్విజయ్​

మధ్యప్రదేశ్​ భోపాల్​లో లోక్​సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్​ సింగ్​... తన ప్రత్యర్థి, భాజపా నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​పై విమర్శలు గుప్పించారు.

ఉగ్రవాదులపై పోరాడి అమరుడైన పోలీసు అధికారి హేమంత్​ కర్కరే తన శాపం వల్లే మరణించారని సాధ్వి ప్రజ్ఞా సింగ్​ లోగడ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఉగ్రదాడికి కారకుడైన మసూద్​ అజార్​ను సాధ్వి ప్రజ్ఞా సింగ్​​ శపించినట్లయితే... లక్షిత దాడులు చేయాల్సిన అవసరమే ఉండేది కాదని ఆయన ఎద్దేవా చేశారు.

భయపడ్డారు...

భోపాల్​లో తనపై పోటీ చేయడానికి భాజపా అభ్యర్థులు భయపడ్డారని దిగ్విజయ్​ సింగ్ అన్నారు. ఉమా భారతి పోటీ చేసేందుకు నిరాకరించారని, గౌర్​ తప్పుకున్నారని చెప్పారు. చివరికి గత్యంతరం లేక నామినేషన్​కు చివరి రోజు సాధ్వి ప్రజ్ఞాసింగ్​ను బరిలో నిలిపారని దిగ్విజయ్​ అన్నారు.

మధ్యప్రదేశ్​ భోపాల్​లో మే 12న పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్లు లెక్కిస్తారు.

ఇదీ చూడండి: 'జిన్నా పేరు ఉచ్ఛరించడం పొరపాటు మాత్రమే'

Sitapur (UP), Apr 27 (ANI): While addressing a public meeting in Uttar Pradesh's Sitapur Prime Minister Narendra Modi said, "Congress is saying that they will reduce presence of armed forces in Jammu and Kashmir. Congress wants to repeal sedition law too. Can people with such mentality remove terrorism and naxalism?"

Last Updated : Apr 28, 2019, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.