సీఏఏ వ్యతిరేక నిరసనల్లో భాగంగా దిల్లీలో రహదారులను దిగ్బంధించారు ఆందోళనకారులు. అన్ని రకాల వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఆందోళనల్లో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు కనీసం అంబులెన్స్లకు కూడా చోటివ్వని పరిస్థితి నెలకొంది. దీంతో బైక్లు, వ్యానుల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు అధికారులు.
ఆందోళన సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగుతుండగా నిరసనకారులను చెదరగొట్టేందుకు యత్నించిన కానిస్టేబుల్ అమిత్కుమార్ చేతికి గాయమైంది. ఈ నేపథ్యంలో అతడిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్కు దారివ్వని కారణంగా బైక్పైనే తీసుకెళ్లారు. ఇలాగే ఇతరులను కూడా ఆసుపత్రికి చేర్చారు.
"ఖజూరీ ఖాస్లో నేను రెండు గ్రూపులను చెదరగొట్టేందుకు యత్నిస్తున్నాను. వెనక నుంచి నాకు బలంగా ఏదో తాకింది. దీంతో నేను గాయపడ్డాను."
-అమిత్ కుమార్, కానిస్టేబుల్
ఇదే ఖురేజీ ఖాస్ ప్రాంతంలో కైఫ్ అనే మరోవ్యక్తికి గాయాలయ్యాయి. అంబులెన్స్కు దారి తొలగని కారణంగా వ్యాన్లో ఆసుపత్రికి తరలించారు. తూటా తగిలిన మరో వ్యక్తిని సైతం ఇలాగే బైక్పై ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కశ్మీర్, సీఏఏ సంగతి మోదీ చూసుకోగలరు: ట్రంప్