ETV Bharat / bharat

కశ్మీర్​లో మరో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

author img

By

Published : Apr 25, 2020, 10:16 AM IST

​పుల్వామాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు సహా ఓ సానుభూతిపరుడు మృతి చెందాడు. మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Two militants and a militant associate were killed in an encounter with government forces in Pulwama district of Jammu and Kashmir
భద్రతా బలగాల​ సెర్చ్​ ఆపరేషన్​లో ముష్కరులు హతం!

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ​ఇద్దరు ముష్కరులతో పాటు వారి సానుభూతిపరుడు మృతి చెందాడు.

దక్షిణ కశ్మీర్​ జిల్లా అవంతిపొరలోని గోరిపొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. జవాన్ల రాకను గుర్తించి, కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. అయితే, వారికి దీటుగా సమాధానమిచ్చింది భారత సైన్యం. ఇద్దరు ఉగ్రవాదులను, వారి సానుభూతిపరుడ్ని మట్టుబెట్టింది.

అవంతిపొర ప్రాంతంలో మరికొంత మంది తీవ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగిస్తున్నట్లు తెలిపారు అధికారులు.

ఇదీ చదవండి:కశ్మీర్​లో ఎన్​కౌంటర్..​ ముగ్గురు ముష్కరులు హతం!

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ​ఇద్దరు ముష్కరులతో పాటు వారి సానుభూతిపరుడు మృతి చెందాడు.

దక్షిణ కశ్మీర్​ జిల్లా అవంతిపొరలోని గోరిపొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. జవాన్ల రాకను గుర్తించి, కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. అయితే, వారికి దీటుగా సమాధానమిచ్చింది భారత సైన్యం. ఇద్దరు ఉగ్రవాదులను, వారి సానుభూతిపరుడ్ని మట్టుబెట్టింది.

అవంతిపొర ప్రాంతంలో మరికొంత మంది తీవ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగిస్తున్నట్లు తెలిపారు అధికారులు.

ఇదీ చదవండి:కశ్మీర్​లో ఎన్​కౌంటర్..​ ముగ్గురు ముష్కరులు హతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.