ETV Bharat / bharat

'చైనా దుశ్చర్యలను మోదీ బహిరంగంగా ఖండించాలి' - pm latest news

సరిహద్దులో చైనా దుశ్చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా ఖండించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​. పొరుగు దేశానికి సరైన గుణపాఠం చెప్పేలా పటిష్టమైన, వేగవంతమైన చర్యలను తీసుకోవాలన్నారు.

PM should condemn China publicly for incursions, take "strong, quick action": Cong
'చైనా దుశ్చర్యలను మోదీ బహిరంగంగా ఖండించాలి'
author img

By

Published : Jun 27, 2020, 5:18 PM IST

తూర్పు లద్దాఖ్​ సరిహద్దులో హద్దు మీరుతున్న చైనా తీరును ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా ఖడించాలని కాంగ్రెస్​ సీనియర్ నేత కపిల్​ సిబల్​ డిమాండ్​ చేశారు. చైనా దుశ్చర్యలకు దీటుగా బదులిచ్చేలా పటిష్టమైన, వేగవంతమైన చర్యలకు మోదీ ఉపక్రమించాలన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద సమస్యను పరిష్కరించే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

భారత భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించాలని చూస్తే వారికి సరైన రీతీలో బుద్ధి చెబుతామని జాతినుద్దేశించి మోదీ ప్రసంగించి హామీ ఇవ్వాలని కోరారు సిబల్​. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు వినతి చేశారు. మోదీ హామీ ఇస్తే ప్రతిపక్షాలు సహా యావత్ దేశం ఆయనకు మద్దతుగా నిలబడుతుందని సిబల్ అన్నారు.

"గత ఆరేళ్లలో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దౌత్యపరంగా దారుణంగా వైఫల్యం చెందింది. వాస్తవాధీన రేఖ వద్ద సమస్యను పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలి. దౌత్యపరమైన, ఆర్థికపరమైన ఆంక్షలకు చైనా తలొగ్గదు. భారత్ తీసుకునే చర్య పటిష్టంగా ఉండాలి. ఎప్పుడు, ఎలాంటి చర్య తీసుకోవాలనే నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలి."

-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత.

20 మంది భారత జవాన్లు అమరులైన గల్వాన్​ లోయలో చైనా నిర్మాణాలు చేపడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. పీపీ-14 వద్ద గుడారాలు ఏర్పాటు చేసి నదీతీరంలో బలగాలతో చైనా కొత్త రోడ్లు నిర్మిస్తోందని శాటిలైట్​ చిత్రాలను చూస్తే స్పష్టమవుతోందని సిబల్​ అన్నారు. ఆ ప్రాంతంలో బుల్డోజర్లు, భారీ సామగ్రితో వాహనాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలు తెలిసి కూడా మోదీ ప్రభుత్వ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్​పై ఈడీ ప్రశ్నల వర్షం

తూర్పు లద్దాఖ్​ సరిహద్దులో హద్దు మీరుతున్న చైనా తీరును ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా ఖడించాలని కాంగ్రెస్​ సీనియర్ నేత కపిల్​ సిబల్​ డిమాండ్​ చేశారు. చైనా దుశ్చర్యలకు దీటుగా బదులిచ్చేలా పటిష్టమైన, వేగవంతమైన చర్యలకు మోదీ ఉపక్రమించాలన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద సమస్యను పరిష్కరించే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

భారత భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించాలని చూస్తే వారికి సరైన రీతీలో బుద్ధి చెబుతామని జాతినుద్దేశించి మోదీ ప్రసంగించి హామీ ఇవ్వాలని కోరారు సిబల్​. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు వినతి చేశారు. మోదీ హామీ ఇస్తే ప్రతిపక్షాలు సహా యావత్ దేశం ఆయనకు మద్దతుగా నిలబడుతుందని సిబల్ అన్నారు.

"గత ఆరేళ్లలో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దౌత్యపరంగా దారుణంగా వైఫల్యం చెందింది. వాస్తవాధీన రేఖ వద్ద సమస్యను పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలి. దౌత్యపరమైన, ఆర్థికపరమైన ఆంక్షలకు చైనా తలొగ్గదు. భారత్ తీసుకునే చర్య పటిష్టంగా ఉండాలి. ఎప్పుడు, ఎలాంటి చర్య తీసుకోవాలనే నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలి."

-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత.

20 మంది భారత జవాన్లు అమరులైన గల్వాన్​ లోయలో చైనా నిర్మాణాలు చేపడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. పీపీ-14 వద్ద గుడారాలు ఏర్పాటు చేసి నదీతీరంలో బలగాలతో చైనా కొత్త రోడ్లు నిర్మిస్తోందని శాటిలైట్​ చిత్రాలను చూస్తే స్పష్టమవుతోందని సిబల్​ అన్నారు. ఆ ప్రాంతంలో బుల్డోజర్లు, భారీ సామగ్రితో వాహనాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలు తెలిసి కూడా మోదీ ప్రభుత్వ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్​పై ఈడీ ప్రశ్నల వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.