మనీలాండరింగ్, పన్ను ఎగవేత వంటి ఆర్థిక నేరాల విచారణ ఒక సంవత్సరంలోపు పూర్తి చేసేలా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. భాజపా నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ ఈ వ్యాజ్యం వేశారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులపై తగిన చర్యలు తీసుకునేలా హైకోర్టులకు దిశానిర్దేశం చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
అవినీతి నిరోధక చట్టాల్లో లోపాలు, కేసుల సాగదీత వల్ల అవినీతి నిరోధక ఇండెక్స్లో భారత్ ఇప్పటివరకు 50వ స్థానంలోపు ఒక్కసారి కూడా రాలేదని న్యాయవాది అశ్వినీ కుమార్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిని నిర్మూలన దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.