గేదె మాంసం, చేపల ఎగుమతిని నిషేధించాలంటూ ఎటువంటి ప్రతిపాదన రాలేదని రాజ్యసభలో తెలిపారు కేంద్ర పశు సంవర్థక సహాయ మంత్రి సంజీవ్ కుమార్. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. రూ.70 వేల కోట్ల విలువ చేసే గేదె మాంసాన్ని, చేపలను భారత్ ఎగుమతి చేస్తోందని చెప్పారు.
గో సంరక్షణశాలల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సంజీవ్. జంతు పరిరక్షణ బోర్డు ఆవుల పరిరక్షణకు రూ.4 కోట్లు విడుదల చేసిందని, అంతకు మించి సహాయం చేయలేదని తెలిపారు. ఈ మొత్తాన్ని ఆవులను సంరక్షించే వారికి వేతనాలుగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'మధ్య'భారతంలో కొత్త సమీకరణలు.. కలహాల్లో కాంగ్రెస్