మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సియోన్, మతుంగ స్టేషన్లలో రైల్వే పట్టాలపై భారీగా వరద నీరు చేరి రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నగరంలోని చెంబూర్, తూర్పు దాదర్, కింగ్స్ సర్కిల్ వంటి ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలచింది. చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు వరద నీటిలో ఇబ్బందులు పడుతున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: శాంతించిన సూర్యుడు- ఉత్తరాదిలో జోరుగా వర్షాలు