ETV Bharat / bharat

మహారాష్ట్ర: ముంచెత్తిన వర్షం- జనజీవనం అస్తవ్యస్తం

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  రాష్ట్రంలోని ప్రధాన నగరాలు సహా గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వృక్షాలు, విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. జన జీవనం అతలాకుతలమయింది.

author img

By

Published : Jul 1, 2019, 9:45 AM IST

Updated : Jul 1, 2019, 11:55 AM IST

మహారాష్ట్ర: ముంచెత్తిన వర్షాలు-స్తంభించిన జనజీవనం
మహారాష్ట్ర: ముంచెత్తిన వర్షం- జనజీవనం అస్తవ్యస్తం

మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సియోన్​, మతుంగ స్టేషన్లలో రైల్వే పట్టాలపై భారీగా వరద నీరు చేరి రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నగరంలోని చెంబూర్​, తూర్పు దాదర్​, కింగ్స్​ సర్కిల్​ వంటి ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలచింది. చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు వరద నీటిలో ఇబ్బందులు పడుతున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: శాంతించిన సూర్యుడు- ఉత్తరాదిలో జోరుగా వర్షాలు

మహారాష్ట్ర: ముంచెత్తిన వర్షం- జనజీవనం అస్తవ్యస్తం

మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సియోన్​, మతుంగ స్టేషన్లలో రైల్వే పట్టాలపై భారీగా వరద నీరు చేరి రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నగరంలోని చెంబూర్​, తూర్పు దాదర్​, కింగ్స్​ సర్కిల్​ వంటి ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలచింది. చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు వరద నీటిలో ఇబ్బందులు పడుతున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: శాంతించిన సూర్యుడు- ఉత్తరాదిలో జోరుగా వర్షాలు

Siliguri (WB), July 01 (ANI): The tea planters in North Bengal are staring at a huge financial loss with the tea prices drastically plummeting in the country. The Bengal tea, which accounts for 35 per cent of the total tea produced in the country, is being sold at a price lower than the cost of production. While speaking to ANI, a tea garden manager said, "The prices have gone down to 15 to 20 Rs per kg and it is happening due to an imbalance between demand and supply of the tea. The demand is less and supply is more. The government should fix a base price of the tea."
Last Updated : Jul 1, 2019, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.