సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి అయిన అక్బోబర్ 31ని ప్రతి ఏటా ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ రోజున 'ఐక్యతా పరుగు'ను నిర్వహిస్తున్నారు.
గుజరాత్ అహ్మదాబాద్ కేవడియాలోని సర్దార్ ఐక్యతా విగ్రహాన్ని నేడు మోదీ సందర్శించనున్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు ప్రధాని. అనంతరం గుజరాత్ పోలీస్, కేంద్ర సాయుధ బలగాలు నిర్వహించే 'రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్'ను వీక్షించనున్నారు. తర్వాత అతిథులు, ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
ఆ తర్వాత సుమారు 450 మంది సివిల్ సర్వీసెస్ ప్రొబేషనర్స్ను మోదీ కలవనున్నారు. సాయంత్రం వడోదరా విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీ పయనమవుతారు.
ఇదీ చూడండి : 'కమలం'పై ఉమ్మడి పోరుకు కాంగ్రెస్ కసరత్తులు!