కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి సన్నిధి గర్భగుడిలో మొబైల్ ఫోన్లు వాడటాన్ని నిషేధించింది ట్రావెన్కోర్ దేవస్థాన మండలి. ఆలయ గర్భగుడికి చెందిన పలు చిత్రాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టినందున ఈ నిర్ణయం తీసుకున్నారు బోర్డు సభ్యులు.
పవిత్రమైన 18 మెట్లు, ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండే 'తిరు ముట్టమ్' దాటిన తర్వాత భక్తులు మొబైల్ ఫోన్లు వినియాగించరాదని స్పష్టం చేశారు. 'వల్లియ నడపండాల్' వద్దే ఫోన్లు స్విచ్చాఫ్ చేయాలని సూచించారు.
మొదటిసారి హెచ్చరిక
మొదటిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ సదరు వ్యక్తికి హెచ్చరిక జారీ చేస్తారు. రెండవ సారి పట్టుబడితే ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని చిత్రాలు, వీడియోలను డిలీట్ చేస్తామని దేవస్థాన బోర్డు తెలిపింది.
ఇదీ చూడండి : స్వామి నిత్యానంద కోసం ప్రత్యేక 'హిందూకైలాస' దేశం..!