తమిళనాడు రామనాథపురం జిల్లా కట్టుపల్లిలోని ఏర్వాడి దర్గా మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గాలేని వారికి చికిత్స అందించడంలో ప్రసిద్ధి చెందింది. రోజూ వెయ్యి మంది ఆ దర్గాను సందర్శిస్తారు. రెండు నెలల క్రితం ఓ మూగ తండ్రి తన కూతురికి చికిత్స కోసం ఆ దర్గాను ఆశ్రయించాడు. అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు.
దర్గాకు నిత్యం వెయ్యి మంది వస్తున్నా... సరైన వసతులు లేవు. మంగళవారం రాత్రి ఆ బాలిక మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లగా ఏడుగురు యువకులు ఆమెను అడ్డుకున్నారు. నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడుగురిని అరెస్టు చేశారు. వీరి వయసు 14 నుంచి 19 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. అత్యాచారం చేసిన సమయంలో నిందితులంతా గంజాయి సేవించి ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి : అసోంలో 'ఏనుగుల' పంట పండిస్తున్న దంపతులు