ETV Bharat / bharat

సౌండ్ తగ్గించమని అడిగితే.. చంపేశారు!

author img

By

Published : Oct 28, 2020, 8:41 AM IST

Updated : Oct 28, 2020, 9:34 AM IST

పక్కింటి వారిని.. మ్యూజిక్​ సౌండ్​ తగ్గించమని అడిగినందుకు ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన దిల్లీలోని మహేంద్ర పార్కు వద్ద జరిగింది. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Man killed in dispute over loud music in northwest delhi
సౌండ్ తగ్గించమని అడిగితే.. చంపేశారు!
దిల్లీలోని మహేంద్ర పార్కు ప్రాంతంలో దారుణం జరిగింది. పక్కింట్లో మ్యూజిక్​ సౌండ్​ తగ్గించమని అడిగినందుకు, ఘర్షణ చెలరేగి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అసలేం జరిగిందంటే..

మహేంద్ర పార్కులోని సరై పైపల్ తలా​ ప్రాంతంలో సుశీల్(29)​ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి ఇంటిపక్కనే ఉన్న అబ్దుల్​ సత్తార్​.. తన ఇంట్లో ఎక్కువ శబ్దంతో పాటలు పెట్టాడు. సౌండ్​ తగ్గించమని అడిగేందుకు సుశీల్​తో పాటు, అతని సోదరులు సునీల్​, అనిల్.. సత్తార్​ ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఘర్షణ తలెత్తింది. వారిపై సత్తార్​తో పాటు అతని నలుగురు కుమారులు కత్తితో దాడి చేశారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుశీల్​ ప్రాణాలు కోల్పోయాడు. అతని సోదరులు సునీల్​, అనిల్​ను బాబు జగ్జీవన్​ రామ్​ మెమోరియల్​ ఆసుపత్రికి తరలించారు. అనిల్​ పరిస్థితి విషమంగా ఉంది. ఈ గొడవలో సత్తార్​ భార్య షాజహాన్​ కూడా గాయపడింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తార్​తో పాటు అతని ఇద్దరు కుమారులు షాహనవాజ్​, ఆఫఖ్​ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. సుశీల్​ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ఇదీ చూడండి:నవంబర్​ నెలాఖరు వరకు అన్​లాక్​-5 నిబంధనలే

దిల్లీలోని మహేంద్ర పార్కు ప్రాంతంలో దారుణం జరిగింది. పక్కింట్లో మ్యూజిక్​ సౌండ్​ తగ్గించమని అడిగినందుకు, ఘర్షణ చెలరేగి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అసలేం జరిగిందంటే..

మహేంద్ర పార్కులోని సరై పైపల్ తలా​ ప్రాంతంలో సుశీల్(29)​ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి ఇంటిపక్కనే ఉన్న అబ్దుల్​ సత్తార్​.. తన ఇంట్లో ఎక్కువ శబ్దంతో పాటలు పెట్టాడు. సౌండ్​ తగ్గించమని అడిగేందుకు సుశీల్​తో పాటు, అతని సోదరులు సునీల్​, అనిల్.. సత్తార్​ ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఘర్షణ తలెత్తింది. వారిపై సత్తార్​తో పాటు అతని నలుగురు కుమారులు కత్తితో దాడి చేశారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుశీల్​ ప్రాణాలు కోల్పోయాడు. అతని సోదరులు సునీల్​, అనిల్​ను బాబు జగ్జీవన్​ రామ్​ మెమోరియల్​ ఆసుపత్రికి తరలించారు. అనిల్​ పరిస్థితి విషమంగా ఉంది. ఈ గొడవలో సత్తార్​ భార్య షాజహాన్​ కూడా గాయపడింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తార్​తో పాటు అతని ఇద్దరు కుమారులు షాహనవాజ్​, ఆఫఖ్​ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. సుశీల్​ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ఇదీ చూడండి:నవంబర్​ నెలాఖరు వరకు అన్​లాక్​-5 నిబంధనలే

Last Updated : Oct 28, 2020, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.