ETV Bharat / bharat

జైలు పర్యాటకంతో కసబ్​ ఉరికంబాన్ని వీక్షించొచ్చు - maharashtra home minsiter about jail tourism in maharashtra

జనవరి 26 నుంచి మహారాష్ట్రలో 'జైలు పర్యాటకం' కార్యక్రమం ప్రారంభం కానుంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న పుణెలోని ఎరవాడ జైలును ఈ కార్యక్రమంలో భాగంగా సందర్శకులు చూడొచ్చు.

jail tourism
కసబ్​ ఉరికంబాన్ని వీక్షించే అవకాశం
author img

By

Published : Jan 24, 2021, 9:27 AM IST

Updated : Jan 24, 2021, 10:18 AM IST

మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి 'జైలు పర్యాటకం' ప్రారంభించేందుకు సిద్ధమైంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న పుణెలోని ఎరవాడ జైలులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తెలిపారు. బ్రిటిష్​ పాలనలో గాంధీ, నెహ్రూ, తిలక్​, పటేల్​, నేతాజీ వంటి జాతి నేతలెందరినో ఎరవాడ జైలులో నిర్బంధించారు. వారి గుర్తులెన్నో అక్కడ నేటికీ పదిలంగా ఉన్నాయి. సందర్శకులు వాటినిప్పుడు చూసే అవకాశం వచ్చింది.

ముంబయిలో 26/11 దాడుల్లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది కసబ్​ను కూడా ఈ జైల్లోనే ఉరి తీశారు. ఆ ఉరికంబాన్నీ సందర్శకులు చూడొచ్చు. ఎరవాడ జైలుతో పాటు ఠాణె, నాసిక్​, రత్నగిరి జైళ్లలోనూ ఈ తరహా పర్యాటకం ఉంటుందని హోం మంత్రి తెలిపారు.

మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి 'జైలు పర్యాటకం' ప్రారంభించేందుకు సిద్ధమైంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న పుణెలోని ఎరవాడ జైలులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తెలిపారు. బ్రిటిష్​ పాలనలో గాంధీ, నెహ్రూ, తిలక్​, పటేల్​, నేతాజీ వంటి జాతి నేతలెందరినో ఎరవాడ జైలులో నిర్బంధించారు. వారి గుర్తులెన్నో అక్కడ నేటికీ పదిలంగా ఉన్నాయి. సందర్శకులు వాటినిప్పుడు చూసే అవకాశం వచ్చింది.

ముంబయిలో 26/11 దాడుల్లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది కసబ్​ను కూడా ఈ జైల్లోనే ఉరి తీశారు. ఆ ఉరికంబాన్నీ సందర్శకులు చూడొచ్చు. ఎరవాడ జైలుతో పాటు ఠాణె, నాసిక్​, రత్నగిరి జైళ్లలోనూ ఈ తరహా పర్యాటకం ఉంటుందని హోం మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి:పాల్​ దినకరన్​ ఇంట్లో 5 కిలోల బంగారు కడ్డీలు

Last Updated : Jan 24, 2021, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.