మధ్యప్రదేశ్లోని పలుప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై వరదలు పొంగిపొర్లుతున్నాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాజాపుర్ జిల్లా కేంద్రంలోని వందలాది ఇళ్లు నీటమునిగాయి. ఆ ప్రాంతంలో వీధులన్నీ వాగులను తలపిస్తున్నాయి.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సిబ్భంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.