కరోనా మహమ్మారికి పోలీస్ ఉన్నతాధికారి బలయ్యారు. పంజాబ్ లుథియానా ఏసీపీ అనిల్ కోహ్లీ వైరస్ సోకి మరణించారు.
అనిల్కు కరోనా సోకినట్లు కొద్దిరోజుల క్రితమే నిర్ధరణ అయింది. ఎస్పీఎస్ ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. అనిల్కు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారమే అనుమతి ఇచ్చింది. అయితే ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.