దేశంలో నిత్యం ఎన్నో వివాహాలు, శుభకార్యాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాల్లో మ్యూజిక్ బ్యాండులు తప్పనిసరి. పెళ్లికి హాజరయ్యే బంధుమిత్రులు బ్యాండు వారి జోరుకు చిందులేయక తప్పదు. అటువంటి బ్యాండులు వాయించే వారందరూ ఒక్క చోటు నుంచే వస్తే ఎలా ఉంటుంది?ఇటువంటి ఆలోచనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్కు తట్టింది.
ఇది నెరవేర్చేందుకు త్వరలో ఛిద్వాఢాలోమ్యూజిక్ బ్యాండ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా జరిగే వివాహాలు, శుభకార్యాలకు ఏర్పాటు చేసే బ్యాండులు రాష్ట్రం నుంచే వెళ్లాలని, అందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
"దేశంలో ఎన్నో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతాయి. అందరు ఎంతో ఉత్సాహంతో ఉంటారు. దేశవ్యాప్తంగా వీటిలో పాల్గొనే బ్యాండులన్నీ మధ్యప్రదేశ్కు చెందినవే ఉండాలని నా కోరిక."
---- కమల్నాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి.