ETV Bharat / bharat

ఉప్పొంగిన 'మహానది'- ఒడిశా జలమయం!

ఒడిశాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బౌధ్​, ఖోర్ధా, బర్గాడ్​, ఝుర్సుగుడా జిల్లాల్లో కురుస్తోన్న వానలతో.. హిరాకుడ్​ డ్యాం 46 గేట్లు ఎత్తారు. మహానది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఒడిశా విపత్తు స్పందన దళం.

author img

By

Published : Aug 30, 2020, 4:46 PM IST

Flood Situation Remains Grim In Odisha
ఉప్పొంగిన 'మహానది'..జలమయమైన ఒడిశా

భారీ వర్షాలు, వరదలతో ఒడిశా గజగజ వణుకిపోతోంది. నదులు, వాగులు ఉప్పొంగి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఒడిశా విపత్తు రాపిడ్​ యాక్షన్​ ఫోర్స్( ఓడీఆర్​ఏఎఫ్​)​ సిబ్బంది.. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Flood Situation Remains Grim In Odisha
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న ఓడీఆర్​ఏఎఫ్​ సిబ్బంది

" కటక్​కు చెందిన ఓడీఆర్ఏఎఫ్​ సిబ్బంది.. పంగట గ్రామంలో ఇద్దరు, తకుర్​పుర్​ గ్రామంలో నలుగురు వరదల్లో చిక్కుకుని ఇంటి పైకప్పుపై ఉండగా.. వారిని రక్షించారు. అలాగే తకుర్​పన్నా గ్రామానికి చెందిన పక్షవాత రోగిని కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. బంకసాహిలో వరదల్లో చిక్కుకున్న 10 మందిని కాపాడి.. కథూరి శిబిరానికి తరలించారు."

- ఒడిశా పోలీసులు

ఉప్పొంగిన మహానది..

హిరాకుడ్​ డ్యాం 46 గేట్లు ఎత్తిన నేపథ్యంలో మహానది ఉగ్రరూపం దాల్చింది. కటక్​లోని ముందులి బ్యారేజీ నిండుకుండలా మారింది. బౌధ్​, ఖోర్ధా, బర్గాఢ్​, ఝర్సుగుడా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కృష్ణ మొహనపుర్​ సమీపంలోని జగన్నాథ రోడ్డు వంతెనపై ఎనిమిది అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. బౌధ్​ నగరంలో వరద నీరు సెంట్రల్​ స్కూల్​, హాస్టళ్లలోకి చేరింది. సుమారు 500 మందిని ఆరు శిబిరాలకు తరలించారు అధికారులు.

Flood Situation Remains Grim In Odisha
మహానది ఉగ్రరూపం
Flood Situation Remains Grim In Odisha
చెరువును తలపిస్తున్న దారులు
Flood Situation Remains Grim In Odisha
వరద నీటిలో ఆలయం
Flood Situation Remains Grim In Odisha
ఉప్పొంగి ప్రవహిస్తున్న మహానది
Flood Situation Remains Grim In Odisha
నిండుకుండలా ముందులి బ్యారేజీ

ఇదీ చూడండి: మధ్యప్రదేశ్​ను ముంచెత్తిన వరదలు.. ఒకరు మృతి

భారీ వర్షాలు, వరదలతో ఒడిశా గజగజ వణుకిపోతోంది. నదులు, వాగులు ఉప్పొంగి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఒడిశా విపత్తు రాపిడ్​ యాక్షన్​ ఫోర్స్( ఓడీఆర్​ఏఎఫ్​)​ సిబ్బంది.. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Flood Situation Remains Grim In Odisha
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న ఓడీఆర్​ఏఎఫ్​ సిబ్బంది

" కటక్​కు చెందిన ఓడీఆర్ఏఎఫ్​ సిబ్బంది.. పంగట గ్రామంలో ఇద్దరు, తకుర్​పుర్​ గ్రామంలో నలుగురు వరదల్లో చిక్కుకుని ఇంటి పైకప్పుపై ఉండగా.. వారిని రక్షించారు. అలాగే తకుర్​పన్నా గ్రామానికి చెందిన పక్షవాత రోగిని కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. బంకసాహిలో వరదల్లో చిక్కుకున్న 10 మందిని కాపాడి.. కథూరి శిబిరానికి తరలించారు."

- ఒడిశా పోలీసులు

ఉప్పొంగిన మహానది..

హిరాకుడ్​ డ్యాం 46 గేట్లు ఎత్తిన నేపథ్యంలో మహానది ఉగ్రరూపం దాల్చింది. కటక్​లోని ముందులి బ్యారేజీ నిండుకుండలా మారింది. బౌధ్​, ఖోర్ధా, బర్గాఢ్​, ఝర్సుగుడా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కృష్ణ మొహనపుర్​ సమీపంలోని జగన్నాథ రోడ్డు వంతెనపై ఎనిమిది అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. బౌధ్​ నగరంలో వరద నీరు సెంట్రల్​ స్కూల్​, హాస్టళ్లలోకి చేరింది. సుమారు 500 మందిని ఆరు శిబిరాలకు తరలించారు అధికారులు.

Flood Situation Remains Grim In Odisha
మహానది ఉగ్రరూపం
Flood Situation Remains Grim In Odisha
చెరువును తలపిస్తున్న దారులు
Flood Situation Remains Grim In Odisha
వరద నీటిలో ఆలయం
Flood Situation Remains Grim In Odisha
ఉప్పొంగి ప్రవహిస్తున్న మహానది
Flood Situation Remains Grim In Odisha
నిండుకుండలా ముందులి బ్యారేజీ

ఇదీ చూడండి: మధ్యప్రదేశ్​ను ముంచెత్తిన వరదలు.. ఒకరు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.