దిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం.. రాజధానిలోని పట్పర్గంజ్ పారిశ్రామిక ప్రాంతంలోని పేపర్ ప్రింటింగ్ ప్రెస్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ఉదయం 2.38 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. 8 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా సమయంలో.. మొత్తం 35 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.