ETV Bharat / bharat

బంగాల్​లో 'అంపన్'​ విధ్వంసం- 12 మంది మృతి

author img

By

Published : May 21, 2020, 9:53 AM IST

అంపన్​ తుపానుతో బంగాల్​ విలవిల్లాడిపోయింది. కోల్​కతా సహా అనేక ప్రాంతాల్లో తుపాను విధ్వంసం సృష్టించింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అంపన్​ తుపాన్ ప్రభావం కరోనా కన్నా దారుణంగా ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

Cyclone Amphan leaves behind trail of destruction in West Bengal, 12 dead
బంగాల్​లో అంపన్​ విధ్వంసం- 12మంది మృతి

బంగాల్​లో అంపన్​ తుపాను బీభత్సం సృష్టించింది. రాజధాని కోల్​కతా సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ప్రకృతి విపత్తు ధాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల సంఖ్య, ఆస్తి నష్టంపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని అధికారులు తెలిపారు.

మంగళవారం సాయంత్రం బంగాల్​లోని దిఘా వద్ద అంపన్​ తుపాను తీరం దాటింది. అనంతరం బంగాల్​ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గంటకు 19 కి.మీల వేగంతో గాలులు వీచాయి.

'కరోనా కన్నా దారుణం...'

విపత్తు నేపథ్యంలో పరిస్థితులను బంగాల్​ ముఖ్యంత్రి మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు సమీక్షించారు. తుపాను ప్రభావం కరోనా వైరస్​ కన్నా దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.

కూలిన చెట్లు.. విరిగి స్తంభాలు...

రాజధాని కోల్​కతా, ఉత్తర 24 పరగణాలు​, దక్షిణ పరగణాల జిల్లాల్లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి. విద్యుత్​ తీగలు తెగిపోయాయి. అనేక ఇళ్లు అంధకారంలో ఉన్నాయి. చెట్లు, విద్యుత్​ స్తంభాలు కూలిపోవడం వల్ల పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. తుపాను ధాటికి సమాచార వ్యవస్థ దెబ్బతింది.

Cyclone Amphan leaves behind trail of destruction in West Bengal, 12 dead
కోల్​కతాలో నేలకొరిగిన చేట్లు
Cyclone Amphan leaves behind trail of destruction in West Bengal, 12 dead
కోల్​కతాలోని ఓ వీధి

బంగాల్​లో అంపన్​ తుపాను బీభత్సం సృష్టించింది. రాజధాని కోల్​కతా సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ప్రకృతి విపత్తు ధాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల సంఖ్య, ఆస్తి నష్టంపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని అధికారులు తెలిపారు.

మంగళవారం సాయంత్రం బంగాల్​లోని దిఘా వద్ద అంపన్​ తుపాను తీరం దాటింది. అనంతరం బంగాల్​ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గంటకు 19 కి.మీల వేగంతో గాలులు వీచాయి.

'కరోనా కన్నా దారుణం...'

విపత్తు నేపథ్యంలో పరిస్థితులను బంగాల్​ ముఖ్యంత్రి మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు సమీక్షించారు. తుపాను ప్రభావం కరోనా వైరస్​ కన్నా దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.

కూలిన చెట్లు.. విరిగి స్తంభాలు...

రాజధాని కోల్​కతా, ఉత్తర 24 పరగణాలు​, దక్షిణ పరగణాల జిల్లాల్లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి. విద్యుత్​ తీగలు తెగిపోయాయి. అనేక ఇళ్లు అంధకారంలో ఉన్నాయి. చెట్లు, విద్యుత్​ స్తంభాలు కూలిపోవడం వల్ల పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. తుపాను ధాటికి సమాచార వ్యవస్థ దెబ్బతింది.

Cyclone Amphan leaves behind trail of destruction in West Bengal, 12 dead
కోల్​కతాలో నేలకొరిగిన చేట్లు
Cyclone Amphan leaves behind trail of destruction in West Bengal, 12 dead
కోల్​కతాలోని ఓ వీధి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.