ETV Bharat / bharat

తప్పిపోయిన 22 ఏళ్లకు తల్లిదండ్రుల చెంతకు!

author img

By

Published : Oct 10, 2020, 7:17 AM IST

కరోనా మహమ్మారి కోట్లమందిని బాధల్లోకి నెడితే కర్ణాటకకు చెందిన మాలిక్​ సాబా బాగవాన్​ కుటుంబాన్ని మాత్రం సంతోషంలో నింపింది. ఎందుకంటే 22 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన కుమారుడు ఆడమ్​​ మాలిక్​ సాబా​.. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి ఇంటికి తిరిగొచ్చాడు. అంతే ఇప్పుడు.. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Corona help Mother-Son: After 22 years they Unite
తప్పిపోయిన 22 ఏళ్ల తరువాత తల్లిదండ్రుల చెంతకు

కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆడం​ మాలిక్​ సాబా, 22 సంవత్సరాల తర్వాత తన తల్లిదండ్రుల చెంతకు చేరాడు. అతని రాక ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపింది.

తప్పిపోయిన 22 ఏళ్లకు.. తల్లిదండ్రుల చెంతకు!

అసలేమైంది..?

మాలిక్​ సాబా బాగవానా- బదిమా దంపతులకు నలుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. వారి స్వస్థలం కర్ణాటక గదగ్​ జిల్లాలోని గొగేరీ గ్రామం. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆడం మాలిక్​ సాబా​ పైచదువులు చదవకుండానే తన సోదరుడితో కలిసి పుణెలోని ఓ హోటల్​లో పని చేయాల్సివచ్చింది. 1998లో తన స్నేహితులతో విహారయాత్రకు ముంబయి వెళ్లిన సమయంలో ఆడం తప్పిపోయాడు. అతని​ తల్లిదండ్రులు పుణె, ముంబయిలో 6 సంవత్సరాలు వెతికి ఆశలు వదులుకున్నారు. అయితే అప్పుడు అదృశ్యమైన ఆడం.. సోలాపూర్​లోని ఓ హోటల్​లో పని ప్రారంభించాడు.

ఉపాధి పోయింది ఊరు గుర్తొచ్చింది..

ఇన్నాళ్లూ సాఫీగా సాగిపోయిన మాలిక్ ​సాబా జీవితానికి.. లాక్​డౌన్​ కారణంగా బ్రేక్​ పడింది. హోటల్​లో ఉపాధి కోల్పోయిన అతని చేతిలో చిల్లిగవ్వ లేదు. ఉపాధి కరవైంది. పూట గడవని పరిస్థితిలో మాలిక్​కు​.. తన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, సొంత ఊరు గుర్తొచ్చాయి. ఈ తరుణంలో సోలాపూర్​ నుంచి గొగేరీ గ్రామంలోని తన తల్లిదండ్రుల చెంతకు పయనమయ్యాడు.

సొంత ఊరికి వచ్చాక..

ఊళ్లోకి రాగానే మాలిక్​సాబా.. తన ఇల్లు ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. గ్రామ ప్రజలను తన తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అప్పటికే ఆడం​ వచ్చాడని తెలుసుకున్న బంధువు ఒకరు అక్కడికి వచ్చి అతడిని తీసుకెళ్లాడు.

22 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన కుమారుడిని.. అతని తల్లిదండ్రులు పుట్టుమచ్చలు, చేతి వేలు, కుడి కాలు తదితర ఆధారాలతో గుర్తించారు.

తల్లి అంచనా నిజమైంది :

ఆరు నెలల క్రితం బదిమా తన కుటుంబసభ్యులతో 'ఆడం​ వస్తాడు.. ఆస్తిలో అతనికి భాగం ఇవ్వాలి' అని చెప్పిందంట. చివరకు ఆ తల్లి మాటలే నిజమయ్యాయి.

కుటుంబ సభ్యులంతా మరిచిపోయినా.. ఆడం తల్లి బదిమా మాత్రం కన్న కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉంది. 22 సంవత్సరాల ఆ తల్లి నిరీక్షణ ఫలించింది. లాక్​డౌన్​ కారణంగా.. మాలిక్​ ఇంటికి వచ్చాక తల్లి ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం ఆడం..​ క్వారంటైన్​లో ఉన్నాడు.

కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆడం​ మాలిక్​ సాబా, 22 సంవత్సరాల తర్వాత తన తల్లిదండ్రుల చెంతకు చేరాడు. అతని రాక ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపింది.

తప్పిపోయిన 22 ఏళ్లకు.. తల్లిదండ్రుల చెంతకు!

అసలేమైంది..?

మాలిక్​ సాబా బాగవానా- బదిమా దంపతులకు నలుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. వారి స్వస్థలం కర్ణాటక గదగ్​ జిల్లాలోని గొగేరీ గ్రామం. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆడం మాలిక్​ సాబా​ పైచదువులు చదవకుండానే తన సోదరుడితో కలిసి పుణెలోని ఓ హోటల్​లో పని చేయాల్సివచ్చింది. 1998లో తన స్నేహితులతో విహారయాత్రకు ముంబయి వెళ్లిన సమయంలో ఆడం తప్పిపోయాడు. అతని​ తల్లిదండ్రులు పుణె, ముంబయిలో 6 సంవత్సరాలు వెతికి ఆశలు వదులుకున్నారు. అయితే అప్పుడు అదృశ్యమైన ఆడం.. సోలాపూర్​లోని ఓ హోటల్​లో పని ప్రారంభించాడు.

ఉపాధి పోయింది ఊరు గుర్తొచ్చింది..

ఇన్నాళ్లూ సాఫీగా సాగిపోయిన మాలిక్ ​సాబా జీవితానికి.. లాక్​డౌన్​ కారణంగా బ్రేక్​ పడింది. హోటల్​లో ఉపాధి కోల్పోయిన అతని చేతిలో చిల్లిగవ్వ లేదు. ఉపాధి కరవైంది. పూట గడవని పరిస్థితిలో మాలిక్​కు​.. తన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, సొంత ఊరు గుర్తొచ్చాయి. ఈ తరుణంలో సోలాపూర్​ నుంచి గొగేరీ గ్రామంలోని తన తల్లిదండ్రుల చెంతకు పయనమయ్యాడు.

సొంత ఊరికి వచ్చాక..

ఊళ్లోకి రాగానే మాలిక్​సాబా.. తన ఇల్లు ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. గ్రామ ప్రజలను తన తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అప్పటికే ఆడం​ వచ్చాడని తెలుసుకున్న బంధువు ఒకరు అక్కడికి వచ్చి అతడిని తీసుకెళ్లాడు.

22 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన కుమారుడిని.. అతని తల్లిదండ్రులు పుట్టుమచ్చలు, చేతి వేలు, కుడి కాలు తదితర ఆధారాలతో గుర్తించారు.

తల్లి అంచనా నిజమైంది :

ఆరు నెలల క్రితం బదిమా తన కుటుంబసభ్యులతో 'ఆడం​ వస్తాడు.. ఆస్తిలో అతనికి భాగం ఇవ్వాలి' అని చెప్పిందంట. చివరకు ఆ తల్లి మాటలే నిజమయ్యాయి.

కుటుంబ సభ్యులంతా మరిచిపోయినా.. ఆడం తల్లి బదిమా మాత్రం కన్న కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉంది. 22 సంవత్సరాల ఆ తల్లి నిరీక్షణ ఫలించింది. లాక్​డౌన్​ కారణంగా.. మాలిక్​ ఇంటికి వచ్చాక తల్లి ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం ఆడం..​ క్వారంటైన్​లో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.