ETV Bharat / bharat

కరోనాను లెక్కచేయకుండా రోడ్డెక్కిన 'షాహీన్​బాగ్'​ నిరసనకారులు

author img

By

Published : Mar 17, 2020, 7:35 PM IST

Updated : Mar 17, 2020, 10:48 PM IST

దిల్లీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలను కూడా లెక్కచేయకుండా ఆందోళనకారులు షాహీన్​బాగ్​లో ప్రదర్శన చేపట్టారు.

COVID-19: Hundreds protest at Shaheen Bagh defying govt ban on mass gatherings
కరోనాను లెక్కచేయకుండా రోడ్డెక్కిన నిరసనకారులు
కరోనాను లెక్కచేయకుండా రోడ్డెక్కిన 'షాహీన్​బాగ్'​ నిరసనకారులు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం విధించిన ఆంక్షలను లెక్కచేయట్లేదు షాహీన్​బాగ్​ నిరసనకారులు. వందలాది మంది పౌరచట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. కొవిడ్-19 వైరస్​​ విస్తరిస్తున్న కారణంగా.. 50మంది కంటే ఎక్కువగా గుమికూడొద్దని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేశారు ఆందోళనకారులు. ఈ నిరసనల్లో మహిళలు, కళాశాల విద్యార్థులు, యువకులు సహా చిన్న పిల్లలూ పాల్గొన్నారు.

వైరస్​ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని.. నిరసనలను విరమించుకోవాలని ఆందోళనకారులతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. ప్రదర్శనలో పాల్గొన్నవారికి మాస్కులు, శానిటైజర్లు అందించడం మానేసి.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. అలాంటివేమీ చేయకుండా.. ఈ సమస్యను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

90 రోజులుగా ఆందోళనలు..

దిల్లీ షాహీన్​బాగ్​లో సీఏఏ వ్యతిరేక నిరసనలు గతేడాది డిసెంబర్​ 15న మొదలయ్యాయి. ఇప్పటికే 90 రోజులు దాటినా ఆందోళనలు ఆగకపోవడం గమనార్హం.

కరోనాను లెక్కచేయకుండా రోడ్డెక్కిన 'షాహీన్​బాగ్'​ నిరసనకారులు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం విధించిన ఆంక్షలను లెక్కచేయట్లేదు షాహీన్​బాగ్​ నిరసనకారులు. వందలాది మంది పౌరచట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. కొవిడ్-19 వైరస్​​ విస్తరిస్తున్న కారణంగా.. 50మంది కంటే ఎక్కువగా గుమికూడొద్దని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేశారు ఆందోళనకారులు. ఈ నిరసనల్లో మహిళలు, కళాశాల విద్యార్థులు, యువకులు సహా చిన్న పిల్లలూ పాల్గొన్నారు.

వైరస్​ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని.. నిరసనలను విరమించుకోవాలని ఆందోళనకారులతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. ప్రదర్శనలో పాల్గొన్నవారికి మాస్కులు, శానిటైజర్లు అందించడం మానేసి.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. అలాంటివేమీ చేయకుండా.. ఈ సమస్యను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

90 రోజులుగా ఆందోళనలు..

దిల్లీ షాహీన్​బాగ్​లో సీఏఏ వ్యతిరేక నిరసనలు గతేడాది డిసెంబర్​ 15న మొదలయ్యాయి. ఇప్పటికే 90 రోజులు దాటినా ఆందోళనలు ఆగకపోవడం గమనార్హం.

Last Updated : Mar 17, 2020, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.